రామ్ గోపాల్ వర్మ చేసే పనులు చేయబోయే పనులు ఎవ్వరికీ ఎలాంటి పరిస్తుతులలోను అర్ధంకావు. ఇలాంటి నేపధ్యంలో వర్మ వంగవీటి మోహన్ రంగ జీవితం పై తీయబోతున్న సినిమాకు ముంబాయి ప్రధాన కేంద్రం కాబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. రంగా జీవితానికి ముంబాయికి ఎటువంటి సంబంధాలు లేకపోయినా వర్మ తీసుకున్న నిర్ణయం చాల ఆశ్చర్యకరంగా మారింది.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం వర్మ తాను తీయబోతున్న వంగవీటి సినిమాకు సంబంధించి ముంబాయిలో ఒక పెద్ద మైదాంనంలో విజయవాడ పరిసరాలను ప్రతిబింబించే విధంగా ఒక సెట్ ను డిజైన్ చేయిస్తున్నాడు అని టాక్. వంగవీటి సినిమాకు సంబంధించిన కీలక సన్నీ వేసాలు అన్నీ ముఖ్యంగా రంగా ఇంటి పోలిన ఒక సెట్ ను ముంబాయిలో వర్మ డిజైన్ చేయించబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థుతులలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేసాలు విజయవాడలో చిత్రీకరిస్తే రకరకాల సమస్యలు ఏర్పడతాయి కాబట్టి వర్మ తెలివిగా ఈ సినిమా షూటింగ్ మొత్తం వ్యవహారాన్ని ముంబాయిలో చిత్రీకరణ వేగవంతంగా పూర్తి చేసి అందరికీ షాక్ ఇవ్వాలని వర్మ ఆలోచనలో ఉన్నట్లు టాక్.

ఇది ఇలా ఉండగా వర్మ ఈసినిమా సంబంధించిన నటీనటుల ఎంపిక కార్యక్రమాన్ని కూడ ముంబాయిలోనే చేయాలని భావిస్తున్నట్లు దీనికి సంబంధించి కొంతమంది బాలీవుడ్ నటులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు గాసిప్పులు వినపడుతున్నాయి. ఈ సంకేతాలను బట్టి చూస్తూ ఉంటే వర్మ తన పట్టుదల మరింత పెంచుతున్నట్లుగా కనపడుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: