బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో రానున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా వార్ సీన్స్ గురించి క్రిష్ తీసుకుంటున్న జాగ్రత్తలు రాజమౌళి తన ‘బాహుబలి 2’ సినిమా వార్ సీన్స్ విషయంలో అతడి ఆలోచనలను పూర్తిగా మార్చి వేసింది అన్న వార్తలు వస్తున్నాయి. క్రిష్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ‘బాహుబలి 2’ కంటే ముందుగా విడుదల కాబోతున్న నేపధ్యంలో ఆ సినిమాలోని వార్ సీన్స్ విషయంలో క్రిష్ తీసుకుంటున్న జగ్రత్తలు రాజమౌళిని తన ‘బహుబలి 2’ వార్ సీన్స్  విషయంలో మరింత శ్రద్ధ పట్టేల చేస్తున్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకాకరం క్రిష్ తన సినిమా కాస్ట్యూమ్స్ ను ‘బాజీరావ్ మస్తానీ’  వార్ సీన్స్ విషయంలో ‘బాహుబలి’ రేంజ్ కి మించేలా తన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ని తీర్చి దిద్దడానికి భారీ ప్రణాళికలు వేస్తున్నట్లు టాక్.  అలాగే ఈ సినిమాలోని మరిన్ని విషయాలపై పరిశోధకులు, ఆర్కియాలజీ నిపుణులతో కలసి క్రిష్ లోతుగా పరిశీలిస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి.  మరోవైపు ఐదు మేజర్ సెట్స్‌ పై ఈ మూవీని పూర్తి చేయాలని అనుకుంటున్నాడు క్రిష్. 

అందులో చెప్పుకోదగినది ఆనాడు శాతకర్ణి పాలించిన నగరం అమరావతి. హిస్టరీ బేస్డ్ సినిమాలకు లొకేషన్స్ చాలా కీలకం కావడంతో  వందల ఏళ్ల చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను సృష్టించడంకోసం సెట్టింగ్స్‌‌కే  భారీ బడ్జెట్ కేటాయించినట్లు టాక్.  ముఖ్యంగా వార్  ఈ సినిమా సీన్స్‌కు మొరాకోను ఎంపిక చేసినట్టు ఇన్‌సైడ్ సమాచారం.  

ఈ వార్ సీన్స్ ను  హాలీవుడ్ రేంజ్‌లో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు క్రిష్. దీనికోసం దాదాపు 3 నెలలపాటు యూనిట్ అక్కడ మకాం వేయబోతున్నారట. మొత్తానికి అలనాటి శాతవాహన రూలర్‌ని అదేవిధంగా ఆ నాటి యుద్దాలను  కళ్లకు కట్టినట్టు చూపించడానికి క్రిష్ చేస్తున్న ప్రయత్నాలు రాజమౌళి దృష్టి వరకు వెళ్ళడంతో రాజమౌళి ‘బాహుబలి 2’  కు  సంబంధించి తన వ్యూహాన్ని  పూర్తి గా మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: