ప్రారంభంలో డివైడ్ టాక్ తో మొదలైన ‘సరైనోడు’ చిట్టచివరకు సక్సస్ బాట పట్టడంతో అల్లు కాంపౌండ్ ఆనoదంలో మునిగి తేలిపోతోంది. దీనితో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈసినిమా నిర్మాత అల్లుఅరవింద్ ఈసినిమాకు సంబంధించి తన అనుభవాలను షేర్ చేసుకోవడమే కాకుండా ఈసినిమా షూటింగ్ లో అల్లుఅర్జున్ తనకు పెట్టిన స్వీట్ టార్చర్ ను నవ్వుతూ వివరించాడు అరవింద్. ఈసినిమాకు దర్శకత్వం వహించిన బోయపాటి అదేవిధంగా ఈసినిమాలో హీరోగా నటించిన అల్లుఅర్జున్ కు సినిమాలంటే మహా పిచ్చి అని అయితే ఒకొక్క సమయంలో వారి స్పీడ్ ను చూస్తే నిర్మాతగా తాను పిచ్చెక్కి పోతానేమో అన్న భయం తనకు కలిగిందని అంటూ తన కొడుకు బన్నీ పై సెటైర్స్ వేసాడు అరవింద్. 

ఈసినిమా నిర్మాణ దశలో ఉండగా చిన్న పిల్లలు చాక్లెట్స్ అడిగినట్లు బన్నీ తనను కొన్ని విచిత్ర కోరికలు కోరిన విషయాన్ని బయట పెట్టాడు అరవింద్. ఈసినిమాకు కెమెరా మెన్ గా పనిచేసిన రుషీ పంజాబీ ఫోటోగ్రాఫర్ అనీ చెపుతూ అతడు ఒక యాడ్ ఫిలింకు రోజుకు కొన్ని లక్షలు తీసుకుంటున్న నేపధ్యంలో అ వ్యక్తి తనకు కెమెరా మెన్ గా కావాలని బన్నీ అడగడంతో తాను నిర్మాతగా చాల టెన్షన్ పడ్డ విషయాన్ని బయట పెట్టాడు అరవింద్. 

అదేవిధంగా ఈసినిమా ఇంటర్వెల్ కు ముందు కేథరిన్ తో వచ్చే పాటలో 130 మంది డ్యాన్సర్లు కావాలని బన్నీ అడిగితే సరే అన్న తరువాత వారంతా  బాంబే డ్యాన్సర్లు అన్న విషయాన్ని బయట పెట్టి తనకు మైండ్ బ్లాంక్ చేసిన విషయాన్ని బయట పెట్టాడు. అంతేకాదు  ‘సరైనోడు’ సినిమా షూటింగ్ లో బన్నీ తన వింత కోరికలతో తనను చాల ఖంగారు పెట్టి టార్చర్ పెట్టాడు అంటూ అరవింద్ తన కొడుకు వింత కోరికలను నవ్వుతూ బయట పెట్టినప్పుడు అరవింద్ కామెంట్స్ విని అల్లుఅర్జున్ షాక్ అయినట్లు టాక్. 

ఈ వార్తలు ఇలా ఉండగా ఈసినిమాకు మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చి మార్కెట్ నుండి ఏవరేజ్ రిపోర్ట్స్ రావడంతో మొదటిరోజు అంతా అల్లుఅర్జున్ ఛాల అసహనంతో కాలం గడిపినట్లు టాక్. అయితే ఈసినిమా విడుదల తరువాత రెండవ రోజు నుండి కలక్షన్స్ పుంజు కోవడంతో అల్లుఅర్జున్ ఇప్పుడు సర్దుకున్నాడని అతని సన్నిహితులు అంటున్నట్లు తెలుస్తోంది. ఈసినిమా పై వచ్చిన సమీక్షలు ఈసినిమాకు చాల కీడు చేశాయని ఏ మాత్రం ఈ సమీక్షలు పాజిటీవ్ గా వచినా ‘సరైనోడు’ బ్లాక్ బస్టర్ హిట్ గా మారి ఉండేదని బన్నీ తన సన్నిహితులతో బాధ పడుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: