విలక్షణ దర్శకుడు తేజ పై క్రిమినల్ కేసు నమోదైనట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ టాలీవుడ్ లో సంచలన వార్తగా మారింది. ఒక కలప వ్యాపారిని బెదిరించిన కేసులో తేజ పై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తేజ పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ఇక ఈ సంచలన వార్త వివరాల్లోకి వెళితే దర్శకుడు తేజాకు కలప వ్యాపారి కృష్ణారావులకు మధ్య ఒక ఇంటికి సంబంధించిన వివాదం నడుస్తోంది అని టాక్. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో విచారణలో ఉంది అని తెలుస్తోంది. 

ఇది ఇలా ఉండగా  ఈ మధ్యన  ఫిలింనగర్ సాయిబాబా గుడి నుంచి బంజారాహిల్స్ వెళుతున్న కృష్ణారావును కొందరు ఆపి దర్శకుడు తేజతో ఉన్న వివాదాన్ని త్వరగా సెటిల్ చేసుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. ఒకవేళ ఈ ఇష్యూను సెటిల్ చేసుకోని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని గట్టిగా బెదిరించినట్లు మీడియా కధనం.

ఈ నేపధ్యంలో ఈమధ్య ఆ వ్యాపారికి తేజా ఫోన్ చేసి  అ వ్యాపారిని హెచ్చరించినట్లుగా  ఆరోపణలు వస్తున్నాయి. దీనితో తనకు ఇలా వరసగా వస్తున్న ఫోన్ కాల్స్ తో సదరు వ్యాపారి కృష్ణారావు  పోలీసులకు ఫిర్యాదు చేశాడు అని వార్తలు వస్తున్నాయి. ఆయన ఇచ్చిన పిర్యాదు ఆధారాలతో పోలీసులు దర్శకుడు తేజ పై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ వార్త ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారడంతో ఫిలింనగర్ లో ఈ న్యూస్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: