స్టార్ ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ మధ్య మార్కెట్ పల్స్ తప్పాడని అంటున్నారు. సినిమాలను తీస్తున్నా హిట్ అందుకోని దిల్ రాజు పంపిణీరంగంలో కూడా ఇదవరకు అంత ఉత్సాహం చూపించట్లేదు. ఇక డబ్బింగ్ సినిమాలను తెలుగులోకి తెస్తున్నా వాటికి సరైనంత పబ్లిసిటీ ఇవ్వక వాటిని కాలదన్నుకుంటున్నాడు. రీసెంట్ గా విజయ్ నటించిన పోలీస్ సినిమాను రిలీజ్ చేశాడు దిల్ రాజు.


ఆ సినిమా ప్రమోషన్ విషయంలో దిల్ రాజు చూపించిన నిర్లక్షానికి తమిళ నిర్మాత కలైపులి ఎస్.థను దిల్ రాజు మీద మండిపడుతున్నాడట. సినిమా తామే సొంతం గా రిలీజ్ చేస్తామనుకుంటే దిల్ రాజు తాను చేస్తానని చెప్పి అలా సినిమాను గాలికి వదిలేశాడని వారి ఫీలింగ్. అయితే సినిమా రిలీజ్ ముందు కేవలం ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు తర్వాత సినిమా టాపిక్ ఎక్కడ తేలేదు.


మరి ఎందుకు అనవసర ఖర్చు అనుకున్నాడో ఏమో కాని దిల్ రాజు పోలీస్ సినిమా విషయంలో చేసిన పొరపాట్ల వల్ల కలైపులి ఎస్.థను నిర్మిస్తున్న కబాలి సినిమా ఛాన్స్ మిస్ అయ్యాడని అంటున్నారు. సూపర్ స్టార్ రజిని నటిస్తున్న ఈ సినిమా మొదటినుండి భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. జూన్ నెలలో రానున్న ఈ సినిమా తెలుగులో దిల్ రాజుకి ఇద్దామనుకుంటే పోలీస్ సినిమాకు చేసిన ఘనకార్యం చూసి మిడిల్ డ్రాప్ అయ్యాడట ఎస్.థను.


మరి ఈ విషయం మీద దిల్ రాజు ఎలా రెస్పాండ్ అవుతాడో తెలియదు కాని మొత్తానికి దిల్ రాజు ఓ మంచి సినిమా ఆఫర్ ను మిస్ చేసుకున్నాడని చెప్పాలి. అదే పోలీస్ ను కాస్త హడావిడి చేసి రిలీజ్ చేసుంటే కబాలి సినిమా కూడా దిల్ రాజు చేతిలోకి వచ్చి ఉండేది. మరి రాబోయే సినిమాల విషయంలో దిల్ రాజు ఎలా ఉంటాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: