ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాహుబలి 2 సినీదర్సకుడు ఎస్ ఎస్ రాజమౌళి అప్పడప్పుడూ ఆటవిడుపు ద్వారా రిలాక్సవుతున్నాడు. పని ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు కాస్త గ్యాప్ ఇస్తూ తన అభిరుచి మేరకు ఈవెంట్లలో పాల్గొంటున్నారు. తాజాగా.. అందరినీ ఆకట్టుకుంటున్న ఐపీఎల్ సందడిలో తానూ పాలుపంచుకుంటున్నారు. 

మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఉప్పల్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌కు రాజమౌళి హాజరయ్యారు. క్రీడాభిమానులతో పాటు తానూ సందడి చేశారు. చేతికి ఐపీఎల్ బ్యాండ్ కట్టుకుని తనను గుర్తించిన అభిమానులకు అభివాదం చేశారు. రాజమౌళిని గుర్తించిన కొందరు ఫ్యాన్స్ చుట్టుముట్టి షేక్ హ్యండ్ ఇచ్చారు. 

ఉప్పల్ స్టేడియంలో జక్కన్నఅభివాదం.. 

దర్శక దిగ్గజంతో కలసి ఆట చూసి ఎంజాయ్ చేశారు. జక్కన్నగా అభిమానులు పిలిచుకునే రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 రూపకల్పనలో బిజిగా ఉన్నారు. బాహుబలి వన్ బంపర్ హిట్ కావడం.. 500కోట్లకుపైగా వసూలు చేయడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ బాహుబలి బంపర్ హిట్ కావడంతో రాజమౌళి సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. 

త్వరలోనే బాహుబలి చైనాలో కూడా విడుదల కాబోతోంది. ఈనేపథ్యంలో ప్రపంచ సినిమాగా మారిన బాహుబలి 2 ను తీర్చిదిద్దడమంటే మామూలు విషయం కాదు. అందుకే కాస్త ఆ ఒత్తిడిని జయించేందుతు దర్శక దిగ్గజం ఇలా అప్పుడప్పుడూ తన అభిరుచులతో రిలాక్సవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: