క్యూట్  హీరోయిన్ సమంత నిన్న జరిగిన తన పుట్టిన రోజు వేడుకులను చాలా వ్యూహాత్మకంగా మలుచుకుంది అన్న వార్తలు వస్తున్నాయి. సౌత్ బ్యూటీ సమంత ఇప్పుడు టాప్ లీగ్ లో కంటిన్యూ  అవుతూ కూడ తన పి ఆర్ టీమ్ చేత నిన్న చేయించిన ప్రచారం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఈమధ్య కాలంలో సమంత పాపులారిటీ తగ్గింది అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో సమంత ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది అన్న వార్తలు వస్తున్నాయి.

గతంలో సమంత ఉంటే సినిమా హిట్టు గ్యారంటీ అనే సెంటిమెంట్ ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేకపోవడంతో సమంత అబద్రతాభావంతో ఉంటోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వచ్చే   నెలలో అతితక్కువ గ్యాప్ తో సమంత నటించన మూడు భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. సూర్యాకి జంటగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో చేసిన ‘24’ లో నితిన్ కి జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ..ఆ’ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సరసన ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాలలో సమంత నటిస్తున్నా సమంత పరిస్థితి గందరగోళంలోఉండటం చాలామందిని అశ్చర్య పరుస్తోంది.

ఈ పరిస్థుతుల నేపధ్యంలో  సమంత తనను  తాను ప్రమోట్ చేసుకునేందుకు ట్రై చేస్తోంది. సౌతిండియాలో 100 కోట్ల షేర్ సాధించిన ఇద్దరు హీరోయిన్లలో తానొకరు అంటూ రీసెంట్ గా ఓ ట్వీట్ చేసింది సమంత. అలాగే యూఎస్ లో 7 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన హీరోయిన్  తానే అనే  ప్రచారం కూడా తన పీఆర్ టీంతో చేయిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో తన బర్త్ డే అయిన 28 ఏప్రిల్ నాడు సమంత హ్యాష్ ట్యాగ్ కు ప్రచారం లభించేలా భారీ ప్లాన్ వేసుకుంది.

ఇన్ని విషయాలు చాలా వ్యూహాత్మకంగా సమంత చేస్తున్నా కోలీవుడ్క్రటిక్స్ మాత్రం రీసెంట్ సినిమాల్లో ఈమె యాక్టింగ్ ను విమర్శిస్తూ తెగ కామెంట్స్  చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఎవరి పుట్టినరోజులకీ  స్పందించని మహేష్ నిన్న సమంతపుట్టిన రోజునాడు తన ట్విట్టర్ లో సమంతకు అభినందనలు చెప్పి సమంత వ్యూహానికి మరింత బలం చేకూర్చాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: