మెగా యంగ్ హీరో  సాయి ధర మ్ తేజ్ కు   కోలీవుడ్ టాప్  హీరో సూర్యా ఒక విషయంలో చుక్కలు చూపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  వరస హిట్స్ తో దూసుకు పోతున్న సాయి ధరమ్ తేజ్ ఈసారి తన అదృష్టాన్ని ఈ సమ్మర్ రేసులో పరీక్షించుకోవడమే కాకుండా ఏకంగా కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటిస్తున్న ‘24’ సినిమాతో పోటీ పడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

ఇప్పటికే మెగా కాంపౌండ్ కు బయటకు చెప్పుకోలేని తలనొప్పిగా మారిన ఈ యంగ్ హీరో ఈసారి ఏకంగా కోలీవుడ్ టాప్ హీరో సూర్యాకు సవాల్ విసరడం ఇతడి మితిమీరిన ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థుతులు ఇలా ఉండగా మన ఇరు రాష్ట్రాలలోను మంచి బిజినెస్ చేసిన ఈసినిమాకు ఓవర్‌ సీస్  మార్కెట్ లో  ఎదురు దెబ్బ తగలడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

ఈసినిమా నిర్మాత దిల్ రాజ్ ఈసినిమా ఓవర్సీస్ రైట్స్ ను 1.5 కోట్లకు అమ్మకానికి పెట్టినా ఒవసీస్ డిస్ట్రిబ్యూటర్లు ఎవ్వరూ ఈసినిమా పై ఆ శక్తి కనబరచడం లేదు అని అంటున్నారు. దీనికి కారణం ఈమధ్యనే విడుదలైన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తో పాటు హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతున్న ‘సరైనోడు’ కి కూడ ఓవర్సీస్ ప్రేక్షకులలో ఆదరణ లభించక పోవడం అని అంటున్నారు.

దీనికితోడు కోలీవుడ్ హీరో సూర్య నటించిన ‘24’ సినిమా కూడ మే 6వ తారీఖున విడుదల అవుతున్న నేపధ్యంలో ఈసినిమా ముందు సాయి ధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ ఏవిధంగాను నిలబడలేదు అన్న నిర్ణయంలో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉండటంతో ఎవ్వరూ ‘సుప్రీమ్’ పట్ల ఆకర్షింప బడటం లేదు అని టాక్. మన తెలుగు రాష్ట్రాలలో కూడ ఈ సినిమాకు బిసి సెంటర్లలో ఆదరణ వస్తుంది కాని సూర్య ‘24’ ను ఎదిరించి ఎ సెంటర్లలో ‘సుప్రీమ్’ నిలబడలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఎలా చూసుకున్నా దిల్ రాజ్ సాయి ధరమ్ తేజ్ పవర్ ను అతిగా ఊహించుకుని సాహసం చేస్తున్నాడు అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: