కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నాడు ఆ మధ్య ఫుల్ ఖాళీ అయ్యి మళ్ళీ కృష్ణాష్టమి తో బిజీ ఐన మనోడు ప్రస్తుతం సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు అని తెలుస్తోంది. రాత్రీ పగలూ అనే తీరిక లేకుండా సంతకం పెట్టిన సినిమాలు కంప్లీట్ చెయ్యడం లో బిజీ అయిపోయాడు. వీటిలో ఆకెళ్ళ వంశీ కృష్ణ డైరెక్షన్ లో జక్కన్న అనే టైటిల్ తో ఉన్న సినిమా సిద్దం అవుతూ ఉండగా. మరొక పక్క పారలల్ గా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు డైరెక్టర్ క్రాంతి మాధవ్ తో ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది. వీరూ పొట్ల డైరెక్షన్ లో వీడు గోల్డ్ అనే సినిమా టాకీ షూట్ నడుస్తూ ఉంది మరొక పక్క. ఇప్పుడు మరొక సినిమాకి సంతకం పెట్టేసాడు సునీల్.


మహా లక్ష్మి బ్యానర్ మీద సినిమాలు చేసే డైరెక్టర్ ఎన్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు సునీల్. ఈ సినిమాకి శంకర్ డైరెక్టర్ కాదు నిర్మాతగా ఉంటారు, అయితే డైరెక్టర్ గా ఉపేంద్ర అనే మాజీ శ్రీను వైట్ల అసిస్టెంట్ ని పెట్టుకున్నారు. సో ఈ రకంగా నాలుగు సినిమాలు ఒకే రేంజ్ లో లాగించేస్తున్నాడు సునీల్ బాబు. ఇప్పటికే రోజు కి రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న సునీల్ మిగిలినవి కూడా ఇలాగే ఫాస్ట్ గా ఫినీష్ చెయ్యబోతున్నాడు. ఈ లెక్కన ఒక వారం పోతే ఒకే రోజు నాలుగు సినిమాల షూటింగ్ లలో పాల్గొనేలా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: