టాలీవుడ్ టాప్ యంగ్ హీరోగా మారడమే తన జీవిత ధ్యేయంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న అల్లు శిరీష్ పట్టువదలని విక్రమార్కుడిలా మరో కొత్త సినిమాకు నిన్న శ్రీకారం చుట్టాడు. అయితే ఈ సినిమా కథను గతంలో యంగ్ హీరో నితిన్ తిరస్కరిస్తే ఇప్పుడు ఆ కథను మోజుపడి అల్లు శిరీష్ ఒప్పుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అల్లు శిరీష్ హీరోగా మల్లిడి వేణు అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా మొదలైంది.

ఈసినిమా కథలో నటించడానికి గతంలో హీరో నితిన్ ఒప్పుకోవడమే కాకుండా ఆ సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మిస్తానని యంగ్ డైరెక్టర్ మల్లిడి వేణుకు మాట ఇచ్చినట్లు టాక్. అయితే నితిన్ ఈ దర్శకుడుని ఒక సంవత్సరం తన ఇంటి చుట్టూ తిప్పుకుని చివరకు ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. దీనితో ఈ దర్శకుడు తన కథతో మెగా కాంపౌండ్ లో తేలి తన కథలో నటించడానికి అల్లు శిరీష్ ను ఒప్పించాడు. 

ఈ సినిమా కథ వినడానికి ముందు దాదాపు 20 కథలు విన్న శిరీష్ మల్లిడి వేణు చెప్పిన కథకు ఫ్లాట్ అయిపోయి తన తండ్రి అల్లు అరవింద్ ను కూడ ఈ కథకు ఒప్పించాడు అని టాక్. ఈసినిమా కథ ఒక పీరియాడికల్ కథ అని అంటున్నారు. దీనితో వెరైటీ సబ్జెక్ట్ గా ఉంటుంది అని అల్లు కాంపౌండ్ ఈసినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు శిరీష్ ఇప్పటి వరకు రెండు సినిమాలలో నటించినా ఏ సినిమా హిట్ కాకపోవడంతో తన మూడవ సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’ పై చాల ఆశలు పెట్టుకున్నాడు శిరీష్. 

ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న లావణ్యా త్రిపాఠీ క్రేజ్ కలిసి వచ్చి తనకు అదృష్టంగా మారుతుందని శిరీష్ ఎన్నో కలలు కంటున్నాడు. ఏమైనా గతంలో ఒక హీరో రిజిక్ట్ చేసిన కథ మరొక హీరోకి కలిసి వచ్చిన సందర్బాలు ఉన్న నేపధ్యంలో శిరీష్ కు నితిన్ తిరస్కరించిన కథ కలిసి వస్తుందేమో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: