‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఘోర పరాజయం తరువాత తిరిగి పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ ని కాపాడుకోవడానికి అవకాశం చిక్కినప్పుడల్లా తన రాజకీయ ప్రకటనలు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరం లేదు అని హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేయడం పై ‘జనసేన’ అధినేతగా పవన్ కళ్యాణ్  నిన్న తన ట్విటర్ లో చేసిన స్పందన రొటీన్ గా మాత్రమే ఉందని అందులో ఎటువంటి క్లారిటీ లేదని పవన్ వీరాభిమానులు కూడ అభిప్రాయ పడుతున్నట్లు టాక్. 

నిన్న పవన్ భారతీయ జనతా పార్టీకి వార్నింగ్ ఇచ్చిన తరహాలో ట్విట్టర్లో ఒక  ప్రకటన  చేస్తూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తే ఇప్పుడు భాజపా కూడా అదే తరహాలో వ్యవహరిస్తోందని పవన్ వ్యాఖ్యానించాడు. ‘సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం సీమాంధ్ర ఎంపీలను, పార్లమెంటులోంచి బయటికి గెంటి, ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి, కాంగ్రెస్ పార్టీ ఒక ఘోరమైన తప్పు చేసింది. ఆరోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మరిచిపోలేదు మరిచిపోరు కూడా’ అంటూ ఆనాటి అవమానాన్ని మరొకసారి గుర్తు చేసాడు పవన్.

‘ఈ రోజు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి, సీమాంధ్ర ప్రజల నమ్మకం మీద దెబ్బ కొట్టి బీజేపీ కూడా అలాంటి తప్పు వైపే అడుగులు వెయ్యకూడదని కోరుకుంటున్నాను’ అంటూ బిజెపిని  తాను మళ్ళీ ప్రశించబోతున్నాను అన్న సంకేతాలు ఇచ్చాడు పవన్. ‘ప్రత్యేక హోదా గురించి ప్రజలు రోడ్ల మీదకొచ్చి ఉద్యమించే లోపే అధికార పార్టీ ఎంపీలు, ప్రతిపక్షాలను కూడా కలుపుకుని పార్లమెంటులో దీని మీద పోరాటం చేయాలని సీమాంధ్ర ప్రజల తరఫున నా విన్నపం’  అంటూ ట్విట్ చేసాడు. 

అయితే ఈ ట్విట్స్ చదివిన చాలా మంది  పవన్  ఏదో విషయమై ఎదో విధంగా స్పందించాలి కాబట్టి స్పందిస్తూ పెట్టిన టిట్స్ లా ఉన్నాయి కాని ఇప్పటికీ పవన్ స్పందబలో ఒక క్లారిటీ అదేవిధంగా ఒక దిశానిర్దేశం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో పవన్ ట్విటర్ కి పవర్ తగ్గిందా అంటూ మరికొందరు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: