టాప్ హీరోల సినిమాల మధ్య పోటీ పెరిగి పోవడంతో రకరకాల పబ్లిసిటీ మార్గాలను అనుసరిస్తూ టాప్ హీరోలు తమ సినిమాలను వెరైటీగా ప్రమోట్ చేస్తూ భారీ ఓపెనింగ్స్ పై కన్ను వేస్తున్నారు. ఇప్పుడు ఇదే పద్ధతి ఈరోజు నుంచి ‘బ్రహ్మోత్సవం’ నిర్మాతలు నుసరిస్తున్నారు. 

ఈరోజు మేడే సందర్భంగా ఈసినిమా ప్రమోషన్ ను మొదలు పెట్టి ఇక్కడ నుంచి అంచలంచలుగా ఈ ప్రమోషన్ వేగాన్ని పెంచి అందరి దృష్టిని ఆకర్షించడానికి ‘బ్రహ్మోత్సవం’ టీమ్ పెద్ద పడకాలనే రచించింది. ఈరోజు నుంచి టీవీ ఛానల్స్ లో 'మధురం మధురం' అనే సాంగ్ ప్రోమోతో పాటు వెబ్ సైట్స్ లో ల్యాండింగ్ పేజ్ ను ‘బ్రహ్మోత్సవం’ యాడ్స్ తో నింపేయడం కోసం ఈసినిమా నిర్మాతలు మాస్టర్ ప్లాన్ రచించారు.
 
ఇప్పటి వరకు టాలీవుడ్ లో చూడనంత రేంజ్ లో పబ్లిసిటీ కార్యకలాపాలు ప్లాన్ చేశారని అంటున్నారు. మహేష్ తన సినిమాను చాలా అగ్రెసివ్ గా ప్రచారం చేయడం గతంలో ‘శ్రీమంతుడు’ విషయంలో చూశాం.

ఇప్పుడు ఈ దూకుడును మరింత పెంచడానికి ఈ సినిమా ఆడియో మే 7న విడుదల కాకుండానే విపరీతమైన పబ్లిసిటీతో ఈ సినిమాను హోరెత్తించ బోతున్నారని టాక్. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం అమెరికాలో మే నెలాఖరున రాబోతున్న లాంగ్ వీకెండ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను మే 27న విడుదల చేసి భారీ కలక్షన్స్ ను అటు అమెరికాలో ఇటు మన తెలుగు రాష్ట్రాలలో తెచ్చు కోవడానికి ఈ సినిమా యూనిట్ చాల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అని వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: