దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. ఈ ముద్గుగుమ్మలు ఇదే ఫిలాసఫీ ఫాలో అవుతున్నారు. క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు కోట్లు వెనకేసుకోవాలని భావిస్తున్నారు. సినిమాలతో పాటు సైడ్ బిజినెస్సులూ పెట్టుకుని లైఫ్ లో స్థిరపడిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల హీరోయిన్ గా కాస్త దూకుడు తగ్గించిన కాజల్.. క్రమంగా సైడ్ బిజినెస్ వైపు దృష్టి మరల్చింది. ముంబైలో తన చెల్లెలితో కలిసి ‘మర్సాలా’ పేరుతో సొంత జ్యువెలరీ స్టోర్ను ప్రారంభించేసింది. ఆ బ్రాండ్ తరఫున నగలు డిజైన్ చేసే బాధ్యతనూ కూడా తనే చూసుకుంటోంది.
కాజల్ ఆభరణాలు భలే భలే..
లాభాలపై మోజుతో కాకుండా ఆభరణాలపై ఉన్న ఇష్టంతనే ఈ రంగంలో దిగానంటోంది కాజల్. తమన్నా కూడా కాజల్ తరహాలోనే నగల దుకాణం పెట్టేసింది. కాకపోతే ఆమె ఆన్లైన్ లో జ్యువెలరీ ఓపెన్ చేసింది. తాను సినిమాల్లోకి రాకముందు నగల డిజైనింగ్లో కోర్సు చేశానని.. అందుకే ఈ బిజినెస్ లోకి దిగానని చెబుతోంది. వైట్ అండ్ గోల్డ్ పేరుతో ప్రారభించిన ఈ జ్యూయలరీలో తాను కూడా డిజైనింగ్ విభాగంలో పాలుపంచుకుంటోందట.
ఆన్ లైన్ దుకాణం పెట్టిన తమన్నా..
‘అత్తారింటికి దారేది’ సినిమాతో బాగా పేరు తెచ్చుకున్న ప్రణీత బెంగళూరులో ‘బూట్ లెగ్గర్’ అనే రెస్టారెంట్ చెయిన్లో కొంత వాటాను ప్రణీత కొనుగోలు చేసింది. ఇప్పుడు తన బయోడేటాలో హీరోయిన్ పక్కన ఎంట్రప్రెన్యూర్ అనే అర్హత కూడా చేర్చేసుకుంది. తనది ఆల్ రెడీ బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి ఇదేమంత కష్టం కాదంటోంది. అవును ఇష్టపడి చేసేదేదీ కష్టం కాదు కదా..
రకుల్ యోగా జిమ్ అదుర్స్..
ఇక ఫిట్ నెస్ కు బాగా ప్రయారిటీ ఇచ్చే హాట్ బ్యూటీ.. రకుల్ ప్రీత్ సింగ్.. వ్యాయామంపైన తనకున్న ఆసక్తిని చాటుకుంటూ ఇటీవలే ‘ఎఫ్ 45’ పేరుతో పూర్తి ఆధునిక సదుపాయాలతో ఉన్న జిమ్ని హైదరాబాద్లో రకుల్ ప్రారంభించింది. ఆమె పరిచయాలకు తగ్గట్టుగానే రానా, రామ్, రవితేజ, రాశీ ఖన్నా, రెజీనా లాంటి చాలా మంది సెలెబ్రిటీలు ఆ జిమ్ ప్రారంభోత్సవానికి వచ్చారు. తనకు బిజినెస్ సూత్రాలు తెలియదని.. అందుకే ఇష్టమైన రంగంలో అడుగుపెట్టానని అంటోంది రకుల్..