పవన్ కళ్యాణ్ కు ఆవేశం తప్పించి లౌక్యం తెలియదు అని చాలా మంది అంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం మారిపోయిన పరిస్థితులలో పవన్ కూడ చాలా వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నాడు అని చెప్పే ఒక ఆసక్తికర విషయం ఈమధ్య జరిగింది అంటూ ఫిలింనగర్ లో గాసిప్పులు వినపడుతున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా పవన్ కూడ ఇంత వ్యూహాత్మకంగా మారిపోయాడా అని అనిపించడం సహజం.

చిరంజీవి 150వ సినిమా ప్రారంభానికి డుమ్మా కొట్టిన పవన్ ‘అ ఆ’ ఆడియో వేడుకకు అతిధిగా రావడానికి అంగీకరించిన విషయం తెలుసుకొని చాల మంది ఆశ్చర్య పోవడమే కాకుండా ఈ వ్యవహారం వెనుక అసలు విషయం ఏమిటి అన్న విషయమై లోతుగా చర్చలు జరిపారు. ఈ చర్చలలో ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.  పవన్ ‘అ ఆ’ ఆడియో వేడుకకు అతిధిగా రావడానికి అంగీకరించింది తన ప్రియ మిత్రుడు త్రివిక్రమ్ కోసమో లేదంటే దేవుడు ఇచ్చిన తమ్ముడు నితిన్ కోసమో కాదు అను అంటున్నారు. 

నితిన్ తండ్రి సుధాకర రెడ్డిని మెప్పించడానికి పవన్ ‘అ ఆ’ ఆడియో వేడుకకు అతిధిగా వస్తున్నాడని టాక్. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా వల్ల బయ్యర్లు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా ఈసినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి 8 కోట్ల వరకు పోయాయి అన్న వార్తలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ ఎస్.జె. సూర్య దర్శకత్వంలో లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా పై ‘సర్దార్’ నష్టాల ప్రభావం ఉంటుంది కాబట్టి రేట్లు తగ్గించి ఈ కొత్త సినిమా రైట్స్ ఇచ్చినా ఇంకా రకరకాల పేచీలు ‘సర్దార్’ బయ్యర్ల నుండి పవన్ కు ఎదురౌతున్నట్లు టాక్. 

ఈ పరిస్థుతలలో డిస్ట్రిబ్యూటర్ల సైడ్ నుంచి ఒక పెద్ద వ్యక్తి మద్దతు అవసరమని భావించిన పవన్ తన కొత్త సినిమాకు సుధాకర రెడ్డి చేత క్లాప్ కొట్టిoచడమే కాకుండా అతడి కొడుకు నితిన్ ‘అ ఆ’ ఆడియో ఫంక్షన్ కు అతిధిగా వెళ్ళి ఆ సినిమా ప్రమోషన్ కు తన వంతు సహకారం చేస్తున్నాడని టాక్. ఏమైనా పూర్తి రాజకీయాలలోకి రాకుండానే పవన్ కు రాజకీయాలు బాగానే తెలిసాయి అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: