టాప్  హీరోల పైనా సినిమారంగ ప్రస్తుత పరిస్థితుల పైనా ఎప్పుడు ఏదోఒక  వివాదాస్పద  వ్యాఖ్యలు చేసే దాసరి నారాయణరావు ఈ మధ్య తనను కలిసిన కొందరు టాలీవుడ్ ప్రముఖుల దగ్గర పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  తెలుగు సినిమా రంగ దిగ్గజాలు లాంటి అక్కినేని నాగేశ్వరరావు నందమూరి తారకరామారావుల తరువాత ఒక లెజెండ్ స్థానంలో నిలవగల సత్తా ఒక్క పవన్ కు తప్ప మరెవ్వరికీ లేదు అని కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి..

దర్శకరత్న దాసరి ఏ సందర్భంలో ఈ కామెంట్ చేసారు అన్న విషయం పై స్పష్టత లేకపోయిన దారి అన్నట్లుగా వస్తున్న ఈ కామెంట్స్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మెగా కుటుంబంలో చిరంజీవికి దాసరికి మధ్య భేదాభిప్రాయాలు ఉన్న నేపధ్యంలో చిరంజీవిని మరింత ఇరుకున పెట్టడానికి దాసరి ఈ కామెంట్స్ చేసి ఉంటాడు అని కొందరి వాదన. మరి కొందరైతే ఎప్పుడో ప్రకటింప బడ్డ దాసరి పవన్ ల సినిమా ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాని నేపధ్యంలో పవన్ దృష్టిని ఆకర్షించడానికి దాసరి ఇలా వ్యూహాత్మకంగా కామెంట్ చేసి ఉంటాడు అనే కామెంట్స్ కూడ ఉన్నాయి.

ఇదే సందర్భంలో దాసరి మరొక ఆశ్చర్యకర కామెంట్ కూడ చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ పరిశ్రమను ఒక లెజెండ్ గా శాసించే అవకాశం చిరంజీవి బాలకృష్ణలకు వచ్చినా ఆ అవకాశాన్ని వారు పూర్తిగా ఉపయోగించుకోలేక పోయారు అనే కామెంట్ కూడ దాసరి చేసిలట్లు టాక్. అంతేకాదు చిరంజీవిని తాను అభిమానించినట్లుగా మరెవ్వరూ అభిమానించరని అయితే కొన్ని మీడియా వర్గాలు కావాలని తనకు చిరంజీవికి మధ్య దూరం పెంచాయని అభిప్రాయ పడినట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ కామెంట్స్ అన్నీ నిజంగా దాసరి పవన్ ఉద్దేసించి అన్నాడా లేదంటే కొందరు కావాలని ప్రచారంలోకి తీసుకు వచ్చారా అన్న విషయమై క్లారిటీ లేదు. అయితే దాసరి పవన్ చేసిన కామెంట్స్ తో పవన్ మనసు మారి త్వరగా దాసరి నిర్మించబోయే సినిమాకు డేట్స్ ఇచ్చి సహకరిస్తాడేమో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: