మూడు వరస విజయాలతో సూపర్ సక్సస్ బాట పట్టిన రాజ్ తరుణ్ కెరియర్ కు ఎదురు లేదు అనుకున్నారు అంతా. అయితే ఆస్పీడ్ అనుకోకుండా ఆగిపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈమధ్య లేటెస్ట్ గా రాజ్ తరుణ్ మంచు విష్ణుతో కలిసి నటించిన ‘ఈడోరకం ఆడోరకం’ సక్సస్ సాధించిన తరువాత కూడ ఈయంగ్ హీరోను వరుసగా 3 సినిమాల నుండి తొలిగించడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

ఆశ్చర్యకరమైన ఈవిషయాన్ని హైలెట్ చేస్తూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. రాజ్ తరుణ్ ఈమధ్య తన సినిమాలు తీయాలని వస్తున్న దర్శక నిర్మాతల వద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని తాను నటించబోయే సినిమా కథకు సంబంధించి స్క్రిప్ట్ విషయమై అనేక మార్పులు చేర్పులు చెప్పడమే కాకుండా హీరోయిన్స్ ఎంపిక విషయంలో కూడ రాజ్ తరుణ్ కొన్ని ఒత్తిడులు చేస్తున్నాడని ఆపత్రిక కథనం. 

ఈహీరోతో ‘శతమానం భవతి’ అనే టైటిల్ తో సినిమా చేయాలని భావించిన దిల్ రాజ్ ఈప్రాజెక్ట్ స్వస్తి చెప్పాడని టాక్. రాజ్ తరుణ్ కు  బదులు శర్వానంద్ ను ఈమూవీలో తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా సీనియర్ వంశీ డైరెక్టర్ గా రాజ్ తరుణ్ తో మూవీ తీయబోయిన మరో నిర్మాత ఇప్పటికే అనేక సినిమాలు తీసిన మధుర శ్రీధర్ లు కూడా తమ మూవీ ప్రాజెక్ట్ ల నుండి రాజ్ తరుణ్ లను తీసివేసినట్లు టాక్. 

అదేవిధంగా రాజ్ తరుణ్ తో ఒక మూవీని తీద్దామనుకుని ప్రయత్నాలు చేసిన దర్శకుడు మారుతీ కూడ రాజ్ తరుణ్ ఇగోను తట్టుకోలేక ఆమూవీ ప్రాజక్ట్ ను అటకెక్కించాడని తెలుస్తోంది. అతి తక్కువ కాలంలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: