బాహుబలి సినిమాలో అవంతిక గా దేశం మొత్తం సూపర్ హిట్ అయిపోయిన హీరోయిన్ తమన్నా మంచి ఊపు మీద కనిపిస్తోంది. ఇప్పుడు ఈమెకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఊపిరి సినిమా కూడా ప్రస్తుతం సూపర్ హిట్ అవ్వడం తో ఆమె ఈ క్రేజ్ ని వాడుకోవాలని చూస్తోంది. తెలుగు , తమిళం లలో వరసగా సినిమాలు చేస్తోంది ఆమె . ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ గా మారిపోయిన తమన్నా ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే ఐటెం సాంగ్ ఆఫర్ లు రావడం తో ఆమె ఫుల్ ఖుషీ గా ఉంది. అయితే ఆమె కోరే పారితోషికం విషయం లో మాత్రం ప్రొడ్యూసర్ లు అతి పెద్ద షాక్ కి గురి అవుతున్నారు అని తెలుస్తోంది.







ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో  ఒస్తున్న జనతా గ్యారేజ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా తమన్నా ని ఐటెం సాంగ్ కోసం అప్ప్రోచ్ అయ్యిన ప్రొడ్యూసర్ లకి తమన్నా భారీ షాక్ ని ఇచ్చింది. ఐదు నిమిషాల నిడివి గల ఐటెం సాంగ్ చెయ్యడం కోసం ఏకంగా కోటిన్నర రెమ్యునరేషన్ అడిగింది తమన్నా. చివరకి ఈ విషయం ఎన్టీఆర్ వరకూ వెళ్ళగా ఆయన కూడా ఆ రేటు ఏంటి అని మండి పడ్డాడట, అయితే ఎన్టీఆర్ కీ తమన్నా కీ ఊసరవెల్లి సినిమా సమయం నుంచీ ఉన్న చొరవ వలన ఇద్దరూ మాట్లాడుకుని తక్కువ రేట్ కి ఫిక్స్ అయ్యారు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: