‘సర్దార్ గబ్బర్ సింగ్’ విజయాన్ని సాధించక పోవడంతో నిరాశలో ఉన్న పవన్ అభిమానులకు నిన్న విజయవాడలో అల్లుఅర్జున్ పవన్ విషయంలో ప్రవర్తించిన తీరుకు విపరీతమైన ఆగ్రహoలో  ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం నిన్న ‘సరైనోడు’ టీమ్ విజయవాడ  సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన సక్సెస్ మీట్ లో అల్లుఅర్జున్ ప్రవర్తన పవన్ అభిమానులకు విపరీతమైన షాక్ ఇచ్చింది అని టాక్. 

ఈ కార్యక్రమానికి విపరీతంగా మెగా అభిమానులు వచ్చారు అయితే అల్లుఅర్జున్ చేసిన ఉపన్యాసంలో చిరంజీవి ప్రస్తావన తీసుకు వచ్చాడు కాని పవన్ కళ్యాణ్ ప్రస్తావన తన స్పీచ్ లో ఎక్కడా తీసుకురాలేదు. బన్నీ మాట్లాడుతున్నంత సేపు పవన్ వీరాభిమానులు పవన్ కు సంబంధించిన స్లొగన్స్ ను ఇస్తున్నా అవేమి పట్టించుకోనట్లుగా అల్లుఅర్జున్ తెలివిగా వ్యవహరిస్తూ తన స్పీచ్ ని ముగించాడు.   

దీనితో ఈ అనుకోని సంఘటనకు  పవన్ అభిమానులు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు అన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా బన్నీ తన స్పీచ్ లో ‘సరైనోడు’ 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పడం పై పవన్ ఫ్యాన్స్ మరింత మండిపోతున్నారు అని టాక్. 

అయితే నిన్న జరిగిన ‘సరైనోడు’ ఫంక్షన్ లో అల్లుఅర్జున్ స్పీచ్ ని నిశితంగా పరిశీలించిన వారు మాత్రం బన్నీ ‘సరైనోడు’ సక్సస్ తో బన్నీ మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తోంది అన్న కామెంట్స్ చేస్తున్నారు. మరి పవన్ అభిమానుల కోపం అల్లుఅర్జున్ రాబోయే సినిమాల పై ఎలా ఉంటుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: