తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది డైరెక్టర్లు వచ్చారు..వస్తున్నారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే చెప్పుకోదగ్గ దర్శకులుగా పేరు పొందారు. తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ డైరెక్టర్ల లీస్టులో చేరిపోయారు..క్రిష్‌ జాగర్లమూడి. గత సంవత్సరం మెగా అబ్బాయి వరుణ్ తేజ్ తో తీసిన ‘కంచె’ సూపర్ డూపర్ హిట్ కావడమే కాక భారత దేశ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం క్రిష్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ చారిత్రాత్మక చిత్రం రూపొందించబోతున్నారు..ఆ చిత్రమే ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’.

కంచె పోస్టర్


ఈ చిత్రానికి సంబంధించి మూహూర్తం, లోగో ఆవిష్కరణ ఫంక్షన్ అత్యంత వైభవంగా జరిగింది. ఇక క్రిష్  ‘కంచె’ చిత్రానికి గాను ఇటీవల జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డు తాలూకు నగదును బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రికి విరాళంగా అందజేశారు.

బాలకృష్ణకు చెక్ అందిస్తున్న క్రిష్

 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ మంచి పనులు చేయాలంటే మంచి మనసు ఉండాలని గొప్ప స్థాయికి చేరుకున్నా కూడా మంచితనం పరిమిళించిన వ్యక్తి క్రిష్ అని పొగిడారు. ఆయన చేపట్టే అన్ని పనుల్లోనూ విజయం సాధించాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా గురించి ఆత్రుతగా వేచి చూస్తున్నానన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: