‘బ్రహ్మోత్సవం’ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ చూసి ఆసినిమా నిర్మాతలతో పాటు మహేష్ బాబు కూడ షాక్ లోకి వెళ్ళిపోతే ‘బ్రహ్మోత్సవం’ మన పొరుగు రాష్ట్రం అయిన కర్ణాటకలో సృష్టిస్తున్న రికార్డ్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. గత శుక్రువారం శాoడిల్ వుడ్ లో కన్నడ సినిమాలతో పాటు పోటీగా విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ అక్కడ సినిమాలు అన్నింటిని వెనక్కు నెట్టి బెంగళూరులో ‘బ్రహ్మోత్సవం’ ఈ వీకెండ్ నెంబర్ వన్ ప్లేస్ సాధించడం విశేషం.

ఈ శుక్రవారం ‘బ్రహ్మోత్సవం’ తో పాటుగా కన్నడ సినిమా ‘యు టర్న్’.. హిందీ మూవీ ‘సరబ్జిత్’.. ఇంగ్లిష్ సినిమా ‘ఎక్స్ మెన్ అపోకలిప్స్’ రిలీజయ్యాయి. ఈ నాలుగు  సినిమాల్లో బ్రహ్మోత్సవమే బెంగళూరు బాక్సాఫీస్ లో నెంబర్ వన్ గా నిలిచింది అన్న వార్తలు వస్తున్నాయి.   ఇంతకుముందు ‘లూసియా’ లాంటి సెన్సేషనల్ మూవీ తీసిన పవన్ కుమార్ నుంచి వచ్చిన రెండో సినిమా ‘యు టర్న్’ మీద అంచనాలు భారీగా ఉన్నా ఆసినిమాను డామినేట్ చేస్తూ ‘బ్రహ్మోత్సవం’ కు కన్నడ ప్రేక్షకులు కలక్షన్స్ కురిపించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

ఈ వార్తలు ఇలా ఉండగా ‘బ్రహ్మోత్సవం’ షాక్ తో మహేష్ తన కుటుంబ సభ్యులతో ముందుగా ప్లాన్ చేసుకున్న లండన్ ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకుని మహేష్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఇచ్చిన ఘోర ఫలితంతో విపరీతంగా నష్టపోయిన బయ్యర్లకు కొంతమేర ఆర్ధిక సహాయం చేయడానికి మహేష్ భార్య నమ్రత రంగంలోకి ప్రవేసించినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అదేవిధంగా మహేష్ మురగదాస్ దర్శకత్వంలో నటించబోతున్న లేటెస్ట్ సినిమాకు ముందుగా అనుకున్నట్లుగా 100 కోట్ల బడ్జెట్ పెట్ట వద్దని దర్శకుడు మురగ దాస్ కు మహేష్ సూచనలు ఇస్తునట్లు సమాచారం.దీనిని బట్టి చూస్తూ ఉంటే ‘బ్రహ్మోత్సవం’ ఘోర పరాజయంతో  మహేష్ యాక్షన్ ప్లాన్ ను పూర్తిగా మార్చుకున్నట్లు అనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: