ప్రస్తుతం త్రివిక్రం తీసిన అఆ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. నితిన్, సమంత జంటగా నటించిన ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో రాధాకృష్ణ నిర్మించారు. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ కూడా నటించింది. సినిమా ప్రమోషన్స్ కు వెళుతున్న ఈ సందర్భంలో అనుపమాను ఎక్కడ రివీల్ చేయట్లేదు త్రివిక్రం.  


ఒకవేళ త్రివిక్రం ఆమెను కథలో ఇంపార్టెంట్ రోల్ కాబట్టి దాస్తున్నాడా లేక ఆమెను కావాలని అవైడ్ చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. అంతేకాదు అఆ కొత్త పోస్టర్స్ లో కూడా నితిన్, సమంత మాత్రమే ఉన్నారు కాని అనుపమా ఎక్కడ కనిపించట్లేదు. ఇలా అయితే అనుపమా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కాక సపోర్టింగ్ రోల్ ప్లే చేసిందా అన్న సందేహాలు వస్తున్నాయి. 


ఇక కొద్ది గంటల క్రితమే సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్న అఆ సినిమా మంచి ఫీల్ తో ఉందట. అందుకే సెన్సార్ వారు సినిమా 'యు' సర్టిఫికెట్ ఇచ్చారు. నితిన్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్  బాగా చేసి ఓ సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. త్రివిక్రం సినిమాలు కచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  


మరి త్రివిక్రం సినిమాలో పనిచేసిన మరొక హీరోయిన్ అనుపమాను కూడా ప్రమోషన్స్ కు వాడుకుంటే మంచిది. ప్రేమం సినిమాలో హీరోయిన్ గా పరిచయమైన అనుపమాకు అఆ ఆడియో రిలీజ్ నుండి ఫ్యాన్స్ తయారయ్యారని చెప్పాలి. మరి అఆ ప్రమోషన్స్ లో ఆమెను వాడక పోతే ఆమె అభిమానులను హర్ట్ చేసిన వారవుతారు త్రివిక్రం.   


మరింత సమాచారం తెలుసుకోండి: