మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం తని ఒరువన్ తెలుగు రీమేక్ ధృవ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. సినిమా స్టార్ట్ చేసినా సరే ఇంకా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. అయితే సినిమాలో ఫిట్ గా కనిపించేందుకు చెర్రి తెగ కష్టపడుతున్నాడని తెలుస్తుంది. అందుకోసం వెజ్ ఫుడ్ నే బాగా తీసుకుంటున్నాడట.


వెజ్ డైట్ తీసుకుంటున్న చరణ్ :


సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంచుకున్నారు. అరవింద్ స్వామి విలన్ గా చేస్తున్న ఈ సినిమాకు చిరు 150వ సినిమా అడ్డుగా మారింది. ఎందుకంటే చిరు సినిమాను నిర్మించేది చెర్రినే కాబట్టి సినిమా గురించి అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు.


ఆ కారణం చేతనే తను నటించే సినిమాను కొద్దిగా పక్కన పెట్టాడు. ఇక ఆ గ్యాప్ లో తన బాడీని మరింత ఫిట్ గా ఉండేందుకు పూర్తిగా కూరగాయల ఆహారాన్నే తింటున్నాడట చరణ్. ఈ విషయం తానే స్వయంగా తన ఫేస్ బుక్ లో రివీల్ చేయడం విశేషం. ప్రస్తుతానికి చరణ్ వెజ్జిగా మారాడన్నమాట.


బ్రూస్ లీ సినిమాలో చరణ్ :


ఇక బ్రూస్ లీ తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కాబట్టి ధృవ మీద చాలా గట్టి నమ్మకాలే పెట్టుకున్నాడు చరణ్. అందుకే సినిమా లేట్ అయినా పర్వాలేదు కాని హిట్ కొట్టేలానే తెరకెక్కిస్తున్నారట. సురేందర్ రెడ్డికి ఫుల్ ఫ్రీడం ఇచ్చి ఈ సినిమాను సూపర్ హిట్ చేసే బాధ్యతను తన మీద పెట్టేశారట. మరి చెర్రి ఆశలను సురేందర్ రెడ్డి ఏం చేస్తాడో చూద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: