ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారిన కాంబినేషన్ పూరీ జగన్నాధ్, కళ్యాణ్ రామ్ ల మూవీ. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఎటువంటి హిట్ ని సాధిస్తుందో అంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాధ్ ఇప్పటి వరకూ ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు కానీ, నందమూరి ఫ్యామిలీ హీరోలను మాత్రం ఎక్కువుగా ఫోకస్ చేయలేదు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రమే పూరీ సినిమాని తీసాడు.


ఆ తరువాత జూనియర్, పూరీతో సినిమాని ప్రయత్నించినప్పటికీ...అది ఇంకా సాధ్యపడలేదు. ఈ లోపు కళ్యాణ్ రామ్ తో పూరీ మూవీని స్టార్ట్ చేశాడు. కళ్యాణ్ రామ్ సైతం ఇప్పటి వరకూ పూరీ లాంటి డైరెక్టర్ తో ఎన్నడూ పని చేయలేదు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న తరువాత ఈ మూవీ తాజాగా సెట్స్‌ పైకి వెళ్ళింది.  ఫస్ట్ షెడ్యూల్ ని ప్రారంభించుకున్న ఈ షూటింగ్, చాలా వేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకోనుందని అంటున్నారు.


ఇందులో కళ్యాణ్ రామ్ చాలా కొత్తగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన స్టోరి విషయంలో కళ్యాణ్ రామ్ ని పూరీ భయపెట్టాడని అంటున్నారు. కళ్యాణ్ రామ్ పాత్ర ఇందులో కొత్తగా ఉండటమే కాకుండా, చాలా రకాల ట్విస్ట్ లతో క్లైమాక్స్ కి చేరుకుంటుందట. ఇన్ని రకాల ట్విస్ట్ లను పూరీ మూవీ నుండి కళ్యాణ్ ఎక్స్ పెక్ట్ చేయలేకపోయాడు.


దీంతో కళ్యాణ్ రామ్...పూరీ పూర్తి కథని విన్న తరువాత షాక్ అయ్యాడని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: