పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు త్రివిక్రం అందుబాటులో లేడా.. పవన్ త్రివిక్రంతో సినిమా తీసే అవకాశం లేదా అంటే ప్రస్తుతానికి ఆ అవకాశాలు లేనట్టే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎస్.జె సూర్య డైరక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత కచ్చితంగా త్రివిక్రం దర్శకత్వంలోనే సినిమానే తీయాలని ఆలోచన ఉన్నా త్రివిక్రం అందుబాటులో ఉండే అవకాశం లేదన్నట్టు తెలుస్తుంది. 


ఎందుకంటే అఆ సినిమా రిలీజ్ తర్వాత వెంటనే మరో ప్రాజెక్ట్ ను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు త్రివిక్రం. సూర్య చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఎందుకో అది ఇప్పుడప్పుడే ముడి పడేట్టు లేదు. ఇక అల్లు అర్జున్ తోనే మరో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతున్నా సూపర్ స్టార్ మహేష్ కూడా త్రివిక్రంతో సినిమాలో నటించేందుకు సిద్ధమంటున్నాడు. 


సో ఈ కారణాల చేతే పవన్ మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి వస్తుంది. అసలైతే త్రివిక్రం చేయాల్సిన పవన్ సినిమాను హరీష్ శంకర్ కొట్టేశాడని అంటున్నారు. ఎస్.జె సూర్య దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్  నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తుండగా.. హరీష్ శంకర్ సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మిస్తారని తెలుస్తుంది.


మరి ఈ రెండు సినిమాల తర్వాతైనా పవన్ కల్యాణ్ త్రివిక్రం కలిసి పనిచేస్తాడా లేక కేవలం రెండు మూడు సినిమాలతోనే ఆపేస్త అంటూ ఎనౌన్స్ మెంట్ ఇచ్చిన పవన్ ఇక రాబోయే రెండిటితోనే ఆపేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి త్రివిక్రం, పవన్ కాంబో సినిమా చూద్దామనుకున్న సిని ప్రేక్షకుడికి వీరిద్దరు కలిసి ఇలా షాక్ ఇచ్చారని డిస్కషన్స్ పెడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: