సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొత్తలో కమెడియన్ గా సునీల్ నవ్వుల జల్లులు కురిపించాడు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న చిత్రంతో హీరో గా మంచి మార్కులే కొట్టేశాడు. తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా డిజాస్టర్ గా మిగిలిపోయాయి. తాను సినిమా ఇండస్ట్రీకి రావడానికి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి అని ఆయన అంటే వల్లమాలిన అభిమానమని మలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ మద్య చిరంజీవి 150 వ చిత్రంలో సునీల్ మళ్లీ కమెడియన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సునీల్ మెగాస్టార్ కి పెద్ద ఝలక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక చిరంజీవి 150 వ చిత్రంలో నటించాలని చాలా మంది నటులు తెగ ఉత్సాహ పడుతున్నారు..ఇలాంటి సమయంలో భీమవరం బుల్లోడు మాత్రం చిరంజీవి పక్కన నటించే చాన్స్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది.  అసలు విషయానికి వస్తే..హీరో అయ్యాక సునీల్ కామెడీ రోల్స్ దాదాపు మానేశాడు. కాని తను ఆరాధించే హీరో కోసం తన హీరో స్థానాన్ని పక్కన పెట్టి మళ్ళీ కమెడియన్‌గా కనిపించటానికి ఒప్పుకున్నాడు. చిరు సినిమా కోసం 40 రోజులు డేట్స్ కేటాయించవలసి ఉందట.

ఈ బిజీ షెడ్యూల్ కారణంగా 40 రోజులు చిరు సినిమా కోసం డేట్స్ కేటాయించడం కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దాంతో ఇప్పుడు సునీల్ స్థానంలో ఇప్పుడు వెన్నెల కిషోర్ ను తీసుకోవాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఇంత పెద్ద కారెక్ట‌ర్ వెన్నెల కిషోర్ కు ప‌డితే మాత్రం మ‌నోడి కెరీర్ ఒక్కసారే టర్న్ అవ్వడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: