వరుణ్‌తేజ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘మిస్టర్’ ప్రారంభం కాకుoడానే రకరకాల గాసిప్పులలోకి వెళ్ళిపోవడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఫ్లాప్ దర్శకుడిగా హవా కొనసాగిస్తున్న శ్రీనువైట్ల దర్శకత్వం వహించబోతున్న ఈసినిమాకు సంబంధించి మరో హాట్ గాసిప్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. వాస్తవానికి ఫిబ్రవరిలో మొదలు కావలిసిన ఈసినిమా ఇంకా మొదలు కాకపోవడానికి వరుణ్ తేజ్ మితిమీరిన కోరికలు అని అంటున్నారు. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా నిర్మాత శ్రీనివాస్ వరుణ్ తేజ్ కు పారితోషికంగా 2 కోట్లు ఆఫర్ చేసినా వరుణ్ తేజ్ మటుకు 5కోట్లు పారితోషికంగా కావాలని పట్టు పట్టడంతో ఈసినిమా నిర్మాతకు వరుణ్ తేజ్ కు ఏర్పడ్డ భేదాభిప్రయాలు వల్ల ఈ సినిమా ముందుకు సాగడం లేదు అని టాక్. దీనితో ఈ సినిమా నిర్మాత వరుణ్ తేజ్ రవితేజా లా ఫీల్ అవుతూ పారితోషికాల గురించి పట్టు పడుతున్నాడు అంటూ తన సన్నిహితుల వద్ద శ్రీనివాస్ కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తునాయి. 

దీనితో మాస్ ఇమేజ్ ఉన్న రవితేజకు 5కోట్లు ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు భయపడుతున్న ఈ రోజుల్లో వరుణ్‌ తేజ్ కి ఇంత పారితోషికమా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నట్లు టాక్. ఇదిలావుండగా ఫస్ట్ షెడ్యూల్ స్పెయిన్ లో మొదలైనట్టు వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైతే నాటా ఉత్సవాల కోసం అమెరికాకు వరుణ్ ఎలా వెళ్లాడనే కామెంట్స్ వస్తున్నాయి. 

అయితే ఈ సినిమా ప్రారంభం కాకుండానే ఇన్ని గాస్సిపులలోకి ఈ సినిమా పై వస్తూ ఉండటంతో ఇక ఈసినిమా అటక ఎక్కినట్లే అన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: