‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ విజయం తరువాత విక్టరీ వెంకటేష్ ప్రత్యేకంగా స్పందించారు. తెలుగులో మల్టీ స్టారర్ ట్రెండు మొదలైంది అనుకోవచ్చా అన్న ప్రశ్నకు ఆయన స్పందన ఇదీ... ‘ఒక్కసినిమాతోనే ట్రెండు మారిపోతుందని నేను చెప్పను. కాకపోతే ఈ చిత్రం తరువాత ఇద్దరుముగ్తురు హీరోలను పెట్టుకుని కథలు రాసుకునేందుకు చాలామంది రచయితలూ దర్శకులూ ధైర్యం చేస్తారు. దీంతో కొత్త కథలు వస్తాయి. ఈ మధ్య నా దగ్గరకి అన్ని రకాల కథలూ వస్తున్నాయి. వాటిల్లో మల్టీ స్టారర్లవి కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేయాలని నేను కూడా కోరుకోను. చేసే ప్రతీదానిలో ఓ కొత్తదనం ఉండాలి. ప్రస్తుతం రామ్ తో కలసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. అది అయిపోయిన వెంటనే వివేకానంద చిత్రం గురించి ఆలోచించాలి. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్’ అంటూ చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: