తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు పోకిరి లాంటి బ్లాక్ బ్లస్టర్ తో మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకున్నారు. అంతే కాదు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ చిత్రం ఎన్నో రికార్డులు తిరగరాసింది. తర్వాత వచ్చిన దూకుడు చిత్రంతో కామెడీ, యాక్షన్ తో మహేష్ బాబు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. గత సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ చిత్రంతో అద్భుతమైన విజయం సాధించారు. ఈ చిత్రంలో మహేష్ నటనకు ఫ్యాన్స్ నీరాజనం పట్టారు. ఒక సోషల్ మెసేజ్ తో ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంది.

ఇక ఈ సంవత్సరం శ్రీకాంత్ అడ్డాల తో సూపర్ స్టార్ మహేష్ తాజా చిత్రం బ్రహ్మోత్సవం ఎన్నో అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కానీ ఆ అంచనాలన్నీ తారుమారై మిశ్రమ స్పందన రావడం..కొన్ని చోట్ల డిజాస్టర్ టాక్ రావడం జరిగింది. సదరు పంపిణీ దారుడైన అభిషేక్ పిక్చర్స్ వాళ్ళకు భారీ నష్టం వచ్చినప్పటికీ  మహేష్ - మురుగదాస్ ల కాంబినేషన్ లో వచ్చే చిత్రాన్ని నైజాం లో  సొంతం చేసుకోవడానికి భారీ ఆఫర్ ఇచ్చారు అభిషేక్ పిక్చర్స్.

అయితే మహేష్ బాబు బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయినప్పటికీ త్వరలో వచ్చే మహేష్ - మురుగదాస్ ల చిత్రం  హక్కులను సొంతం చేసుకోవడానికి ఏకంగా 25 కోట్ల ఆఫర్ ఇచ్చారని టాక్ అయితే ఇది ఎంతవరకో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అంతే కాదు ఇటీవలే మహేష్ బ్రహ్మోత్సవం చిత్రాన్ని నైజాం లో అభిషేక్ పిక్చర్స్ రిలీజ్ చేసారు. మొత్తానికి మహేష్ బాబుపై ఉన్న నమ్మకంతో మురుగదాస్ పై నమ్మకంతో ఈ చిత్రానికి అంత మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ద పడుతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: