నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీ ‘గౌతమీ పుత్రశాతకర్ణి’.క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చారిత్రక చిత్రం తాజాగా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. మొరాకోలో భారీ యుద్ధ సన్నివేశాలను ముందుగా చిత్రీకరించారు. ఇక బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ గా వస్తున్న ఈ చిత్రం, బ్లాక్ బస్టర్ సాధిస్తుందనే నమ్మకం తనలో ఎక్కవుగా ఉంది.


అలాగే కథని నమ్మి చేస్తున్న చిత్రం‘గౌతమీ పుత్రశాతకర్ణి’ కావటంతో ఈ మూవీ కచ్ఛితంగా  బ్లాక్ బస్టర్ సాధించటం ఖాయం అని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడు. ఇక సక్సెస్ పక్కా కావటంతో, దర్శకుడు స్వంత బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అయితే ఈ మూవీలో దర్శకుడు దాదాపు 25 కోట్ల రూపాయలు మేర పెట్టుబడులు పెట్టాడని అంటున్నారు.


దర్శకుడు క్రిష్ మొదటిసారిగా ఇంత భారీ మొత్తంగా పెట్టుబడి పెట్టటంతో ఇండస్ట్రీ అంతా ఒక్కాసారిగా షాక్ అయింది. ఎందుకంటే ‘గౌతమీ పుత్రశాతకర్ణి’ మూవీలో పెట్టుబడులు పెట్టానికి చాలా మంది ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నప్పటికీ...వారందని కాదని దర్శకుడు క్రిష్ అధిక వాటాని కైవసం చేసుకున్నాడు.


ఒక వేళ ఈ మూవీ సక్సెస్ ని సాధిస్తే...కచ్ఛితంగా భారీ లాభాలను క్రిష్ చూడనున్నాడు. కనీసం 40 కోట్ల రూపాయల మేర క్రిష్ ప్రాఫిట్స్ చూడనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ‘గౌతమీ పుత్రశాతకర్ణి’ మూవీ రెండవ షెడ్యూల్‌కు రెడీ అవుతుంది. అలాగే హీరోయిన్ విషయంలోనూ అధికారికంగా త్వరలోనే ఓ నిర్ణయం రానుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: