బాలీవుడ్ లో ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ రేసు లో ఉన్నవారిలో దీపిక పదుకొణే ముందు ఉంటారు.  బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తో నటించిన ఓం శాంతి ఓం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డమ్ సంపాదించిన ఈ కన్నడ బ్యూటీ తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ దాదాపు హిట్ కావడంతో నెంబర్ వన్ పోజీషన్లోకి వెళ్లింది. అంతే కాదు దీపిక ఇప్పుడు బాలీవుడ్, అటు హాలీవుడ్ లలో సత్తా చాటుతున్నది. అంతే కాదు దీపికా కు బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా ఆఫర్లు రావడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఇప్పటికే తన సహనటి ప్రియాంకా చోప్రా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతే కాదు అక్కడ ఓ సిరియల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

దీంతో ఈ అమ్మడు కూడా హాలీవుడ్ చిత్రాలపై మోజు పెంచుకోవడం అనుకోకుండా హాలీవుడ్  తెరంగేట్రం చేసిన చిత్రం 'ట్రిపులెక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌'.  ఈ అమ్మడు  'ట్రిపుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' లో విన్ డీసెల్ సరసన నటిస్తున్నది. పూర్తి యాక్షన్ తరహా రూపొందుతున్న ఈ చిత్రంతో దిపీకాకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగిపోయింది. దీంతో  పలు యాడ్ సంస్థలు దీపికని తమ కంపెనీకి బ్రాండ్ గా తీసుకోవాలని భావిస్తున్నాయి. మరి కొందరు ఈ అమ్మడితో యాడ్స్ చేసి తమ సంస్థను మరింత పాపులర్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఎయిర్ లైన్స్ సంస్థ ఓ యాడ్ కోసం దీపికని సంప్రదించారట.  అయితే ఈ యాడ్ కోసం కేవలం నాలుగు రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారట. అంతే కాదు ఈ అమ్మడికి డిమాండ్ మేరకు ఆ యాడ్ కోసం నాలుగు కోట్లు రెమ్యునరేషన్ ని ఇవ్వాలని వారు భావించారు. కానీ దీపికాను సంప్రదించిన  ఎయిర్ లైన్స్ సంస్థ షాక్ కి గురయ్యారట..ఎందుకంటే ఆ యాడ్ లో నటించడానికి ఈ అమ్మడు అక్షరాలా ఎనిమిది కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో సంస్థ సభ్యులు మరో మాట మాట్లాడకుండా గమ్మున బయటకు వచ్చేశారట. ఎంత హాలీవుడ్ లో చేస్తే మాత్రం ఈ రేంజ్ డిమాండ్ ఎంత వరకు సబబు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: