ఇదివరకున మంచు లక్ష్మి గురించి కామెడీ చేసుకునే వారు కూడా ' మేము సైతం ' టీవీ షో తో ఆమెని అభిమానించడం మొదలు పెట్టారు. సహాయం కోసం ఎదురు చూసే పెదవారినీ .. సెలెబ్రిటీ లనీ ఒకే వేదిక పైకి తీసుకువచ్చిన అద్భుత కార్యక్రమం ఇది. సెలెబ్రిటీ లనీ , హీరో లనీ, స్టార్ హీరోయిన్ లనీ రోడ్డు మీద మామూలు వ్యక్తుల లాగా నడిపించి మరీ పని చేయించి కావాల్సిన సొమ్ములు ఆర్జించి అవసరం అయినవారికి ఇవ్వడం ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్.

 

 ఈ కార్యక్రమం ఆమె దిగ్విజయం గా పూర్తి చేసింది అని చెప్పాలి. ఎందరో పేదలకి తమ తమ అవసరాలకి తగ్గ డబ్బులు ఈ కార్యక్రమం ద్వారా దక్కేసాయి. ఈ కార్యక్రమం త్వరలో ముగియనుండగా ఆఖరి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈ బాధ్యత ని చక్కగా పూర్తి చేసిన ఆమె ఇప్పుడు రిలాక్స్ అవడం కోసం ఫారిన్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. షూటింగ్ బిజీ అయ్యీ అవ్వడమే యూరప్ చుట్టేయ్యాలి అని ఆమె లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికే ఆ దేశం చేరుకున్న ఆమె నిజానికి ఇటలీ లోని ఫ్లోరెన్స్ కి వెళ్ళాలి లండన్ మీదగా నే ఇటలీ వెళ్ళాలి కానీ లండన్ లో ఫ్లైట్ మిస్ అవడం తో ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తూ బాధ పడుతున్నారు ఆమె.

 

ట్విట్టర్ ద్వారా తెలిసింది :

 

  'నా జీవితంలో ఈ రోజు ఒక పీడకల లాంటిది' అని ఆమె స్వయంగా ట్వీట్ చేసిందంటే ఎంత ఇబ్బంది పడిందో అర్ధమవుతుంది. " లండన్ లో ఫ్లైట్ మిస్ అయ్యాను , నా తప్పు తో పాటు విపరీతమైన వరదలు కూడా దీనికి కారణం. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఎయిర్పోర్ట్ లోనే కూర్చోవాలి . ఐపాడ్ లో చార్జింగ్ కూడా లేదు . ఎయిర్ పోర్ట్ నేల మీద పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ప్రస్తుతం " అని ఇంకొక ఇబ్బందికర ట్వీట్ చేసారు ఆమె. ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి ప్రస్తుతం పీడ కల అనుభవిస్తున్నాను అంటే ఆమెని ఫాలో అయ్యేవారు కూడా అయ్యో పాపం అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: