ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తున్న న్యూస్ చిరంజీవి కత్తిలాంటాడో మూవీపైనే. ఈ మూవీకి సంబంధించిన న్యూస్ కానీ, ఫోటోలు కానీ ఎక్కడ వినిపించినా, కనిపించినా ఫ్యాన్స్ వాటి కోసం తెగ ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం కత్తిలాంటోడు లో నటిస్తుండటంతో...ఈ మూవీ రిలీజ్ వరకూ చిరంజీవి ఎప్పుడూ హాట్ టాక్స్ గానే ఉండాలి.


అందుకే తోటి హీరోలకి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ ని కానీ, ఆ మూవీలకి సంబంధించిన ట్రైలర్స్ ని కాని అప్పుడప్పుడూ టచ్ చేస్తూ ఉండాలి. ఇందులోని భాగంగానే తాజాగా సునీల్ నటించని జక్కన్న మూవీ ఆడియో ఫంక్షన్ కి మెగాస్టార్ చిరీంజీవి హాజరు అయ్యారని అంటున్నారు.


ఆకెళ్ళ వంశీకృష్ణ దర్శకత్వంలో సునీల్ హీరోగా నటించిన చిత్రం ‘జక్కన్న’. మన్నార్ చోప్రా హీరోయిన్ గా ఈ మూవీలో నటించింది. ఇక ఆడియో ఫంక్షన్ కి వచ్చిన చిరు, సునీల్ ని తెగ పొగిడేశారు. టాలీవుడ్‌లో ఉన్న బెస్ట్ డాన్సర్స్‌లో సునీల్ ఒకరంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఇక చిరంజీవి స్ట్రాటజీని తెలుసుకున్న ఇతర యంగ్ హీరోలు, వారి మూవీలకి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ కి, ట్రైలర్ రిలీజ్ కి చిరుని పిలవటం పనిగా పెట్టుకున్నారు.


కత్తిలాంటోడు మూవీ రిలీజ్ నాటికి చాలా మంది హీరోలు వారి మూవీలకి సంబంధించిన ఫంక్షన్స్ కి చిరుని ఇప్పటికే ఇన్వైట్ చేశారంట. అందుకు చిరు సైతం వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇది చిరునటిస్తున్న అప్ కమింగ్ మూవీకి ఫ్రీ పబ్లిసిటి కింద ఉపయోగపడుతుందని కత్తిలాంటోడు చిత్ర యూనిట్ భావిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: