ప్రస్తుతం ఫాంలో ఉన్న మెగా హీరోల్లో ఓ పక్క రేసుగుర్రం అల్లు అర్జున్ అయితే ఆ రేసుగుర్రానికి తోడుగా రేసులో తాను దూసుకెళ్తున్నాడు మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్.. తీసిన నాలుగు సినిమాలతోనే మెగా అభిమానుల్లో ఓ మార్క్ వేసుకున్న సాయి ధరం తేజ్ రీసెంట్ గా సుప్రీం హిట్ తో మరింత ఖుషిగా ఉన్నాడు. ఇక చేస్తున్న తిక్క సినిమా కూడా దాదాపు పూర్తయింది.


ఓ పక్క గోపిచంద్ మలినేని సినిమా స్టార్ట్ చేసేందుకు చూస్తున్నారు. అయితే ఈ టైంలో వంశీ పడిపల్లితో తేజు సినిమా తీస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. తిక్క సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో సినిమాకు ఎలాంటి సంబంధం లేకుండా వంశీ పైడిపల్లి అటెండ్ అవడం అందరిని ఆశ్చర్యంలో పడేసింది. మొన్నటిదాకా అఖిల్ రెండో సినిమా వంశీ డైరక్షన్లోనే అంటూ హడావిడి చేసిన సంగతి తెలిసిందే.


అఖిల్ కు ఏ కథ చెప్పినా అంత సాటిస్ఫై అవ్వట్లేదని వంశీ చిన్నగా ఆ సినిమా నుండి వాకవుట్ చేశాడు. ఇక మహేష్ తో సినిమా చేసే అవకాశం ఉన్నా అది జరగాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే. అందుకే ప్రస్తుతం జోష్ లో ఉన్న సుప్రీం హీరో సాయి ధరం తేజ్ తో సినిమాకు రెడీ అవుతున్నాడట. గోపిచంద్ మలినేని సినిమా, వంశీ సినిమా రెండు పార్లర్ గా కానిచ్చెస్తాడట తేజు.


ఊపిరితో హిట్ అందుకున్న వంశీ పడిపల్లి సాయి ధరం తేజ్ తో సినిమా తీయడం మెగా అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు. కెరియర్ లో దర్శకుడిగా వంశీ పైడిపల్లి, హీరోగా సాయి ధరం తేజ్ ఇద్దరు మంచి కసితో పనిచేస్తున్నారు మరి ఇద్దరి కలయికలో వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: