సరైన సక్సెస్ పడిందంటే తరువాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఊహించటం కష్టమే. అనుకోని విధంగా క్రేజీ కాంబినేషన్స్ అన్నీ ఆ హీరోకి సెట్ అవుతుంటాయి. తనకి తెలియకుండానే మార్కెట్ లో తన వాల్యూ పెరుగుతూ వస్తుంది. ఇందుకు ప్రస్తుతం నితిన్ అనుభవిస్తున్న రాజసమే ఉదాహరణ అని అంటున్నారు.


వరుస సక్సెస్ లను చూస్తున్న నితిన్, తాజాగా అఆ మూవీ సక్సెస్ సైతం తనకి మంచి పేరుని తెచ్చింది. దీంతో టాప్ ప్రొడ్యూసర్స్ అంతా నితిన్ మార్కెట్ బాగుండటంతో, తనతో మూవీలను చేయటానికి ముందుకు వస్తున్నారు. ఆ విధంగానే ప్రస్తుతం టాలీవుడ్ కి చెందిన భారీ నిర్మాత రాధామోహన్‌, నితిన్ తో సినిమాకి ఒప్పుకున్నారు.


ఈ మూవీ శ్రేష్ట్ మూవీస్‌లో బ్యానర్ లో నిర్మితం కానుంది. ‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ వంటి సినిమాలతో నిర్మాత రాధా మోహన్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా మారారు. ప్రొడక్షన్ విషయంలో రాధామోహన్‌ ఏ మాత్రం రాజీపడరు. ఈ నిర్మాతతో చాలా కంఫర్ట్ ఉంటుందని హీరోలు సైతం అంటారు. ఇలాంటి నిర్మాత ఇప్పుడు నితిన్ కోసం రావటంతో వెంటనే నితిన్ సైతం ఒప్పుకున్నాడు. అయితే ఈ మూవీలో దర్శకుడు ఎవరు అనే విషయం మాత్రంపై ఇంకా స్పష్టత రాలేదు.


త్వరలోనే ఈ కాంబినేషన్  కి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. నితిన్ కోసం ఒక్క రాధామోహన్‌ మాత్రమే కాకుండా ఇతర నిర్మాతలు సైతం కదిలి రావటంతో నితిన్ కి అంతా శుభపరిణామాలే అని అంటున్నారు. ఇటువంటి సమయంలో ఆలోచించి మంచి కథలను సెలక్ట్ చేసుకుంటే నితిన్ సైతం టాప్ డైరెక్టర్స్ కి వాంటెడ్ హీరో అవుతాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: