పోసాని కృష్ణమురళి సెటైర్ వేస్తే ఎంతటి పెద్ద వ్యక్తి అయినా తట్టుకోవడం కష్టమే. అటువంటి పోసాని ‘మా’ సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లో చేసిన  వ్యాఖ్యలు నిన్న ప్రసారం అయిన 'మా' టివి సినిమా అవార్డ్స్ ఫంక్షన్ చూసిన వారికీ షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ అవార్డ్స్ కార్యక్రమంలో ఎన్టీఆర్ పూరీల కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ చిత్రానికి మంచి ప్రాధాన్యత దక్కిన విషయం తెలిసిందే. ఈఅవార్డ్స్ కార్యక్రమంలో  ఉత్తమ నటుడు అవార్డ్ ఎన్టీఆర్ కి ఇవ్వగా ఉత్తమ సహాయ నటుడు కేటగిరీని కూడ టెంపర్ సినిమాకే ఇచ్చారు. 

అయితే అవార్డ్ తీసుకునేందుకు స్టేజ్ పైకి వచ్చిన పోసాని తనదైన శైలిలో  మాట్లాడుతూ రైటర్ గా డైరెక్టర్ గా యాక్టర్ గా ఎటుపోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నపుడు రామ్ చరణ్ మూవీ ‘నాయక్’ లో చేసిన పాత్ర తర్వాత  తన కెరియర్ టర్న్ అయిందని అంటూ ‘టెంపర్’ లో తాను చేసిన పాత్రద్వారా  టాలీవుడ్ లో తన స్థానం సుస్ధిరం అయింది అన్నాడు. అంతేకాదు ‘లవ్యూ రాజా’ అంటూ చెర్రీకి పూరీకి తన స్టైల్ లో థ్యాంక్స్ చెప్పాడు. 

అంత వరకు కధ మామూలుగా నడిచినా అసలు ట్విస్ట్ ఇక్కడే ఇచ్చాడు పోసాని. తనకు రైటర్ గా డైరెక్టర్ గా నంది అవార్డులు ఎప్పుడో రావాల్సి ఉంది అని అంటూ తనకు  ఎందుకు రాలేదో ఇప్పుడు అప్రస్తుతం అని అసలు విషయం బయట పెట్టాడు పోసాని. తన పేరు నామినేషన్స్ లో ఉందని మాటీవీ వాళ్లు చెప్పినపుడు ఆశ్చర్యపోయాను అని అంటూ  బహుశ మా టీవీ వాళ్లను ఇన్ ఫ్లుయెన్స్ చేయకపోవడం వల్లనే తనకు ఈఅవార్డు ఇచ్చి ఉంటారు అంటూ సెటైర్ పేల్చాడు.

అయితే బుల్లితెర పై ప్రసారం అయిన ఈ కార్యక్రమo చూస్తున్న వారికి పోసాని నంది అవార్డులపై ఇలా ఇన్ డైరెక్ట్ పంచ్ వేసడా ? లేదంటే మా టీవీ అవార్డ్స్ లో కూడ కొన్ని తేడాలు జరిగాయి అని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆవిషయాలను దృష్టిలో పెట్టుకుని ఇలా వ్యాఖ్యలు చేసాడా ? అని ఆ కార్యక్రమం టీవీలలో చూసిన చాలామంది టాలీవుడ్ ప్రముఖులకు సందేహం కలిగింది అని టాక్. అయితే పోసాని ఈకామెంట్స్ చేస్తున్నప్పుడు మా టీవీ అవార్డ్స్ ఎంపికలో కీలక పాత్ర పోషించారు అని గాసిప్పుల వార్తలలోకి వచ్చిన నాగ్ చిరంజీవిలు పోసాని  వ్యాఖ్యలను  చాలా నిశితం వినడం ఈకార్యక్రమoలోని కొసమెరుపు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: