తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోల హవా కొనసాగింది. ఇప్పటి వరకు ఆయన వారసులుగా పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాంచరణ్ లు హీరోలుగా మంచి ఫామ్ లో ఉన్నారు. రీసెంట్ గా సాయిధరమ్ తేజ,వరుణ్ తేజ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి మంచి హిట్స్ సాధించారు. ఇక సాయిధరమ్ తేజ్ అయితే సుప్రీమ్ హీరోతో తన జోరు బాగా పెంచాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి తొమ్మిది సంవత్సరాల క్రితం శంకర్ దాదా జిందాబాద్ చిత్రంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసి రాజకీయాల్లో కి వెళ్లారు.  ఇక తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. తన 150 చిత్రం  తమిళ హిట్ చిత్రం కత్తి రిమెక్ గా రూపొందించ బోతున్నారు.


ఈ చిత్రం ‘కత్తిలాంటోడు’ టైటిల్ తో రాబోతుంది...ఇప్పటికే సెట్స్ పై కి వెళ్లగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు మాత్రమే ఎంట్రీ ఇవ్వగా చూశాం..తాజాగా నాగబాబు కూతురు కొణిదెల నిహారిక ‘ఒక మనసు’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక బాట పడుతున్నారు చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ. అయితే హీరోయిన్లుగా మాత్రం కాదండీ..మరో విభాగంలో తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఆయన 150 వ చిత్రానికి సంబంధిం కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ఎంట్రి ఇస్తుంది.

తండ్రికి కావాలసిన డ్రెస్సింగ్ ఎలా ఉండాలో పూర్థి అధికారం ఈమెనే దక్కించుకుంది. ఇక చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఈ మద్య ఓ వ్యాపార వేత్త ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తన భర్త కోరిక మేరకు శ్రీజ కూడా సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాల ని ఆలోచనలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సొంతగా ఓ ప్రొడక్షన్ ఏర్పాటు చేసి సినిమాలకు నిర్మాణ సారధ్యం వహించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ మద్య సినీ ఇండస్గ్రీ సీనియర్ హీరోల కూతుళ్లు కూడా వారసులకు సమానంగా తమ సత్తా చాటుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: