తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో పాపులర్ అయిన హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో నిలబడాలంటే అదృష్టం కూడా కలిసి రావాల...ప్రస్తుతం ఆ లక్కీ హీరో ఎవరా అంటే రాజ్ తరుణ్ అని చెప్పొరు. డైరెక్టర్ కావాలనుకొని వచ్చి హీరో అయిన హీరో లీస్టు లో ఉన్న రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల చిత్రం మంచి హిట్ కావడం తర్వాత వచ్చిన సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మనోడు మినమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు. అలాంటి హీరోకి ఇప్పుడు ఓ షాక్ తగిలింది...ఇంతకీ ఆ షాక్ ఎవరు ఇచ్చారనుకున్నారా..అఖిల్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బామ సాయేషా సెహగల్.

వాస్తవానికి ఈ అమ్మడు పెద్ద హీరోయిన్ కూడా కాదు..అలాంటిది రాజ్ తరుణ్ పక్కన వచ్చిన  అవకాశాన్ని ఈ అమ్మడు సున్నితంగా రిజెక్ట్ చేసేసిందట.ఈ విషయం ఆమె తల్లి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో రాజ్ తరుణ్ మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.వరుసగా మూడు సినిమాలు చేయడానికి నిర్ణయం జరిగినా, ఓ సినిమా ఎందుకో ఆగిపోయిందన్న వార్తలు హల్ చల్ చేశాయి.

అలాంటి హీరోని అఖిల్ హీరోయిన్ సాయేషా సెహగల్ తిరస్కరించడంతో మనోడు అవమానంగా ఫీల్ అయ్యాడట. అయితే ఈ అమ్మడికి బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వస్తుండడంతో రాజ్ తరుణ్ మూవీకి డేట్స్ కేటాయించలేక దాన్ని రిజెక్ట్ చేసిందని ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహీన్ పేర్కొంది.ప్రస్తుతుం ఆమె అజయ్ దేవగన్ సరసన శివాయ్ లో నటిస్తోంది. నకు నచ్చిన స్టోరీలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని షాహీన్ స్పష్టం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: