ఇండియాలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల కంటే ఒక్క టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే స్టార్స్ కి మంచి కంఫర్ట్స్ ని ఇస్తాయి. ఇక మిగతా ఏ ఇండస్ట్రీ చూసిన...టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని కంఫర్ట్స్ ని వారు ఎక్కడా పొందలేరు. ఆ విధంగా ప్రస్తుతం కోలీవుడ్ హీరో అయిన విజయ్ ఆంటోనీ, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో కెరీర్ ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు.

దీనికి సంబంధించిన వివరాలను చూస్తే, తాజాగా తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న తమిళ చిత్రం బిచ్ఛగాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బి, సి సెంటర్లలో ఈ చిత్రానికి అనూహ్యమైన స్పంధన రావటంతో ప్రతి ఒక్కరూ థియోటర్స్ కి క్యూలు కట్టారు. అత్యంత తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం లెక్కకు మించిన లాభాన్ని నిర్మాతలకి తీసుకువచ్చింది.

దీంతో విజయ్ ఆంటోనీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీని కారణంగా విజయ్ ఆంటోనీ కి తెలుగులో ఒక్కసారిగా మార్కెట్ పెరిగింది. తను తాజాగా నటిస్తున్న చిత్రం 'సైతాన్'. ఈ మూవీకి సంబంధించిన తెలుగు రైట్స్ కోసం పోటీ ఏర్పడింది. అలాగే విజయ్ ఆంటోనీ తెలుగులో  తన సినిమాలను చేయాలని నిర్ణయించుకున్నారు.

తెలుగులో తనకి వచ్చిన గుర్తింపుని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. ఇంతకాలం చెన్నైలో మకాం పెట్టిన ఈ హీరో, ఇప్పుడు పూర్తిగా హైదరాబాద్ కి షిప్ట్ కావాలని చూస్తున్నాడంట. మొత్తంగా బిచ్ఛగాడు ఎఫెక్ట్ ఈ హీరోపై బాగానే ప్రభావాన్ని చూపించిందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: