నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తున్న సంగతి తెలిసిందే.. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని మూడో షెడ్యూల్ కు రెడీ అవుతుంది. అయితే ఈలోపు హిందూపురం ఎమ్మెల్యేగా పనులు చూసుకుంటున్న బాలయ్య అక్కడ ప్రజలకు తన 101వ సినిమా రైతు అని డిక్లేర్ చేశాడు.  


వందవ సినిమా రేసులో కృష్ణవంశీ రైతు కూడా ఉంది. అయితే చరిత్రలో నిలిచిపోవాలంటే రైతు కథ కాదు శాతకర్ణి డిసైడ్ చేసిన బాలయ్య అలానే తన 101వ సినిమా కూడా ఎవరికి తెలియకుండానే రైతు సినిమా అని కన్ఫాం చేశారు. ఇక ఈ న్యూస్ తో కృష్ణవంశీ ఎంతో సంతోషంగా ఉన్నాడు. క్రియేటివ్ డైరక్టర్ గా తనకు మంచి పేరున్నా ఈ మధ్య సినిమాల్లో వెనక్కి తగ్గిన కృష్ణంవంశీకి ఇది నిజంగా లక్కీ ఆఫర్ అని చెప్పాలి. 


తన సినిమా ఏదైనా ప్రేక్షకులను ఉత్తేజ పరచే కృష్ణవంశీ ప్రస్తుతం సందీప్ కిష్ హీరోగా నక్షత్రం సినిమా చేస్తున్నాడు. సందీప్ కిషన్, రెజినా జంటగా నటిస్తున్న ఈ సినిమాతో తన సత్తా చాటి ఇక మళ్లీ రైతు కోసం రెడీ అవనున్నాడు కృష్ణవంశీ. కెరియర్లో దర్శకుడిగా తనకు మాత్రమే సాధ్యపడే సినిమాలు తీసిన కృష్ణవంశీ బాలయ్య సినిమా చేయడం గొప్ప విషయం. 


ఓ పక్క శాతకర్ణి సినిమా చూసుకుంటూనే మరో పక్క రైతు సినిమాకు సంబందించిన పూర్తి స్థయి కథను కూడా రెడీ చేయమని కృష్ణవంశీకి చెప్పాడట. మొత్తానికి కృష్ణవంశీ ఈ సినిమాతొ మళ్లీ ట్రాక్ ఎక్కే అవకాశం ఉంది. ఇక బాలయ్యకు కథ వినిపించిన వారిలో అనీల్ రావిపూడి, బోయపాటి శ్రీను కూడా ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: