తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే అక్కడ అభిమానులకు పండుగ వాతావరణం అన్నట్లే..రజినీ సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుంచే థియేటర్ల వద్ద హంగామా మొదలవుతుంది. సినిమా జయాపజాయలతో సంబంధం లేకుండా తమ సూపర్ స్టార్ థియేటర్లో కనిపిస్తే చాలు జన్మధన్యం అనుకునే అభిమానులు తమిళనాట ఉన్నారు. అంతే కాదు రజినీకాంత్ కి భారత్ లోనే కాదు మలేషియాల, సింగూపర్, జపాన్ లో కూడా మంచి అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు అక్కడ కూడా విపరీతంగా నడుస్తాయి. తాజాగా రజినీ నటించిన కబాలి చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పటి వరకు రజినీకాంత్ ఒకరకంగా కనిపిస్తే..ఈ చిత్రంలో మాత్రం రజినీ చాలా నేచురల్ గా తన వయసుకు తగ్గ విధంగా కనిపిస్తున్నారు.

తెల్లగడ్డంతో మాఫియా నేథన్యంలో సాగే చిత్రంలా కనిపిస్తుందని అంటున్నారు. అయితే ఈ చిత్రం కథ లీక్ అయ్యిందని సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. లీక్ అయిన కథనం ప్రకారం  స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీష్ పరిపాలనలో కొంత మంది తమిళనాడు యువకులను మలేషియాకు బానిసలుగా తీసుకు వెళ్తారట..వారితో పాటు కబాలి కూడా వెళ్తాడ. అయితే అక్కడ కబాలి కొంత మంది యువకులను చేరదీసి ఓ ఉద్యమం లేవదీస్తాడట. బానిసలుగా బాధలు అనుభవిస్తున్నతన జాతి కోసం చేసిన పోరాటమే ఈ కబాలి అని అంటున్నారు.

ఈ క్రమంలోనే కబాలి నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం దాన్ని వదిలివేయడం చేస్తాడట. మలేషియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం రజనీ ఫ్యాన్స్ ని ఉర్రూత లూగించేలా ఉండనుందట . రజనీ సరసన రాధికా ఆప్టే నటించిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ థాను నిర్మించగా జూలై 15న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: