దేశంలో ఈ మద్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా అవుతున్నాయి. ఈ ప్రమాదాలు ఏలా జరిగినా కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్న మాట వాస్తవం. ఇక రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా..వీటిని మాత్రం అరికట్టలేపోతున్నారు. ఇక రోడ్డు ప్రమాదంలో చిన్నా పెద్ద..పెదా ధనకి అన్న బేధం ఉండదు మృత్యువు ఎవరినైనా వెంటాడుతూనే ఉంటుంది. ఇక రోడ్డు ప్రమాదల్లో ఈ మద్య సెలబ్రెటీలు కూడా దారుణంగా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. రీసెంట్ గా ఓ హాలీవుడ్ హీరో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

 తాజాగా తెలుగు హీరో నందమూరి నట సింహం బాలకృష్ణకు పెద్ద ప్రమాదం తప్పింది. బాలకృష్ణ హిందూ పురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ లో విరామం దొరికితే ఆయన తన నియోజక వర్గానికి వెళ్లి వస్తున్నారు. తాజాగా హిందూ పురం నుంచి బెంగుళూరు వెళ్తున్న బాలకృష్ణ ఓ లారీని ఓవర్ టేక్ చేయబోగా పక్కనుంచి కొన్ని పశువులు అడ్డు రావడంతో ఆయన కారు డివైడర్ ని ఢీ కొంది. ఈ సంఘటన కర్ణాటకలోని బాగేపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో వాహనం స్వల్పంగా ధ్వంసమైంది.

ఈ ప్రమాదంతో కారు బాగా డ్యామేజ్ అయ్యింది...అయితే కారులో ప్రయాణిస్తున్న బాలయ్యకు పెద్దగా గాయాలు కాలేదు..వెంటనే వేరే వాహనంలో బెంగుళూరుకి పయనమయ్యారు. ప్రస్తుతం బాలకృష్ణ..క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమీ పుత్ర శాతకర్ణీ’ చిత్రంలో నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: