ఎన్టీఆర్  లేటెస్ట్ గా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ మూవీలో నిత్యామీనన్ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. పేరుకి ఇది సెకండ్ హీరోయిన్ పాత్ర అయినా ఈ సినిమా కధను మలుపు తిప్పేపాత్రను నిత్యమీనన్ పోషిస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న నిత్యామీనన్ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ పై సంచలన కామెంట్స్ చేసింది. 

ఎన్టీఆర్ పై నిత్య చేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్ లో తెగ హడావిడి  చేస్తూ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి.  మాములుగా  నటీనటులు అంతా కెమెరా ముందు నటిస్తారు. కానీ ఎన్టీఆర్ జీవిస్తాడు అని  చెపుతూ  ఎన్టీఆర్ ఒక యాక్టర్ కాదు సైన్యం లాంటివాడు అంటూ ఆశక్తికర కామెంట్స్ చేసింది నిత్యా మీనన్. 

ఇదే సందర్భంలో మరిన్ని విషయాలు చెపుతూ  తాను ఒక సీన్ లో సరిగ్గా నటించలేక ఎన్నో సార్లు టేక్ తీసుకున్న విషయం గుర్తుకు చేసుకుంటూ తాను అన్ని టేక్స్ తీసుకున్నా ఎక్కడా విసుగు లేకుండాతనకు సహకరించిన ఎన్టీర్ వ్యక్తిత్యం చూసి  తాను జూనియర్ కు అభిమానిగా మారిపోయాను అని అంటోంది ఈ మలయాళ బ్యూటీ. అయితే ఎప్పుడు ఏహీరోను పెద్దగా పొగుడుతూ మాట్లాడని నిత్య ఇలాంటి ఆసక్తిక కామెంట్స్ జూనియర్ పై చేయడంతో నిత్యామీనన్ కూడా మారిపోయిందా ? అంటూ సెటైర్లు పడుతున్నాయి. 
 
ఈ వార్తలు ఇలా ఉండగా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించి  షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసి ఇక మిగిలిన ఈ సినిమా  పాటల చిత్రీకరణ విషయమై తన దృష్టి పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో అన్ని అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతూ  ఉండటంతో  ‘జనతా గ్యారేజ్’ విడుదల ఆగష్టు 12 న ఖాయం అని అంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: