గత రెండు సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రం ఊరిస్తూ వస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది..చిరంజీవి చాలా రోజుల తర్వాత తెరపై పూర్తి స్థాయిలో హీరోగా చూడబోతున్నారు. గత పది సంవత్సరాల క్రితం శంకర్ దాదా జిందాబాద్ చివరి చిత్రం.. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు వివివినాయ్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ చిత్రం ‘కత్తి’ ని రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల గురించి పోరాడే వ్యక్తిగా ఈ చిత్రంలో మెగాస్టార్ చాలా కొత్త తరహాగా కనిపించబోతున్నాడు.

అయితే ఈ చిత్రం హీరోయిన్ ఎవరా అన్న విషయంపై ఇప్పటికే తర్జన భర్జన జరుగుతున్న విషయం తెలిసిందే.  చిరంజీవికి సరిపడ హీరోయిన్ ఇండస్ట్రీలో చాలా మందిని వెతికి చూసినా ఆయన ఇమేజ్ కి తగ్గట్టు ఎవర్వూ లేరని తేలింది..గతంలో త్రిష తో నటించినా ఇప్పుడు మాత్రం వర్క్ ఔట్ కాదని తెలిసింది.

ఇక బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ను తీసుకుందామని మెగా క్యాంప్ అనుకుంది.కానీ…దీపిక రెమ్యునరేషన్ ఎక్కువగా అడగడంతో ఆ ప్రపోజల్ ను డ్రాప్ చేసుకున్నారు. ఇక ఇండస్ట్రీలో టాప్ పొజీషన్ లో ఉన్న హీరోయిన్ ఎవరా అంటే అనుష్క అనే చెప్పాలి..ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు పొందుతున్నవే. కాకపోతే ఆ మద్య వచ్చిన సైజ్ జీరో చిత్రంలో కాస్త లావెక్కింది..ఇక సన్నబడటానికి నానా తంటాలు పడుతుంది. అంతే కాదు ఈ అమ్మడు ప్రస్తుతం బాహుబలి-2 , సింగం 3 ప్రాజెక్టులతో బిజీగా ఉంది.  

ప్రభాస్ ఫ్రెండ్ బ్యానర్ యువీ క్రియేషన్స్ పై తీసే భాగమతి కి డేట్స్ ఇచ్చింది అనుష్క. ఇప్పుడు చిరు పక్కన అనుష్కను తీసుకోవడమే సబబు అనుకుంటున్నారు.  మొత్తానికి రాంచరణ్ తన స్నేహితుడైన  ప్రభాస్ ద్వారా భాగమతి నిర్మాతలను ఒప్పించి.. అనుష్క డేట్స్ ని అటు భాగమతికి, ఇటు కత్తిలాంటోడు కు సర్దుబాటు చేసేలా చూడమని అడగాలనుకుంటున్నట్టు ఒక టాక్ వచ్చింది. ఒకవేళ ఈ ప్రయత్నం సక్సెస్ అయితే చిరు సినిమాకు హీరోయిన్ ప్రాబ్లెం తీరినట్టే అని బావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: