సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ గా వినిపిస్తున్న చిత్రం మహేష్ బాబు,మురుగదాస్ ల చిత్రం. ఈ సినిమా షూటింగ్ జులై 15న ను ప్రారంభం కానుంది. అయితే తాజా షెడ్యూల్స్ ప్రకారం ఇది 29 నుండి మొదలు కానుంది. ఈ మూవీలో హీరోయిన్ గా పరిణీతి చోప్రా నటించనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ మూవీకి సంబంధించిన ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది.


మురుగదాస్ రాసుకున్న కథ పూర్తిగా దొంగిలించబడిందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. మహేష్ కోసం మురుగదాస్ రాసుకున్న కథని బైండింగ్ చేసి పెట్టారు. అయితే తన ఆఫీస్ లో ప్రస్తుతం ఇటువంటి ఒక ఫైల్ మిస్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులు సైతం దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


మురుగదాస్ టీం సభ్యులు కాకుండా, కొత్తవారు తన ఆఫీస్ లోకి వచ్చిన సందర్భంలో ఇది జరిగిందని ఆఫీస్ సభ్యులు గుర్తించారంట. అయితే కోలీవుడ్ లో హాట్ టాక్స్ గా వినిపిస్తున్న ఈ న్యూస్ ఎంత వరకూ నిజం అనే దానిపైనా స్పష్టత లేదు కానీ, ప్రస్తుతం మాత్రం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది.


అలాగే మురుగదాస్, మహేష్ కోసం రాసుకున్న స్క్రిప్ట్ బుక్ మిస్ అయిందంటూ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లోనూ పిర్యాదు చేశారని అంటున్నారు. తీసుకున్న వారు మిస్ యూజ్ చేస్తారనే ఉద్ధేశంతోనే మురుగదాస్ ఇలా చేశారంటూ చెప్పుకొచ్చారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి అఫిషయల్ గా స్పష్టత రానుందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: