పైకి చెప్పకపోయినా సాయిధరమ్ తేజ్ స్పీడ్ చూసి మెగా కాంపౌండ్ షాక్ అవుతోంది అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. ఇది చాలదు అన్నట్లుగా సాయిధరమ్ తేజ్ మరో షాక్ మెగా కాంపౌండ్ కు ఇచ్చాడు. టాప్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ప్రస్తుతం శింబుతో తమిళంలో తెలుగులో నాగచైతన్యతో తీసిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదల అయిన వెంటనే గౌతమ్ మీనన్ ఏకంగా నాలుగు భాషల్లో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ భారీ మల్టీస్టారర్ లో సాయిధరమ్ తేజ్ అనుష్క తమన్నా పృథ్వీరాజ్ పునీత్ రాజ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా నటించబోతున్నారట. ఈ విషయాన్ని గౌతమ్ మీనన్ తమిళ మీడియాకి లీక్ లు కూడ ఇచ్చేస్తున్నాడు. ఒక భారీ సినిమాని ఒక భాషలో తీయడమే కష్టం అయి పోతున్న ఈ రోజులలో ఒక సినిమాను ఏకంగా నాలుగు భాషల్లో తీయ బోతూ ఉండటం దక్షిణాది సినిమా రంగంలో హాట్ న్యూస్ గా మారింది.
ఇప్పటికే ఈ సినిమాకు అనుష్క - తమన్నాలు కాల్షీట్లు కూడా ఇచ్చేశారని వార్తలు వస్తున్నాయి. సాయిధరమ్ తేజ్ కూడా గౌతమ్ మీనన్ ఎప్పుడంటే అప్పుడు రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడట. ఇటీవల ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆడియో వేడుకకి హాజరైన సాయిధరమ్ తేజ్ తనని గౌతమ్ మీనన్ ప్రేమకథలు ఎంతగా ప్రభావితం చేసాయో చెప్పడంతో ఆ మాటలకు మురిసిపోయిన గౌతమ్ మీనన్ సాయి ధరమ్ తేజ్ ను పిలిచి ఇలా అవకాశం ఇచ్చాడు అన్న ప్రచారం జరుగుతోంది.
అయితే ట్విస్ట్ ఏమిటంటే ఈభారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ విషయంలో దర్శకుడు గౌతమ్ మీనన్ కొద్దికాలం క్రితం రామ్ చరణ్ అల్లుఅర్జున్ లతో చర్చించి నట్లు టాక్. అయితే ఈ మూవీ ప్రాజెక్ట్ విషయంలో చరణ్ బన్నీలు పెద్దగా ఆసక్తి కనపరచక పోవడంతో ఈ ప్రాజెక్ట్ ను గౌతమ్ మీనన్ కొంతకాలం అటక ఎక్కించి ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకు వస్తున్నాడని తెలుస్తోంది. అయితే చరణ్ బన్నీలు వద్దు అనుకున్న మల్టీస్టారర్ లో సాయి ధరమ్ తేజ్ వచ్చి చేరడం ఇప్పుడు మెగా కాంపౌండుకు మరో కొత్త షాక్..