‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయాడు అని ఇప్పటిదాకా ప్రభాస్ అభిమానులు పండుగ చేసుకుంటూ కాలం గడిపారు. 600 వందల కోట్లకు పైగా కలక్షన్స్ ను వసూలు చేసిన ‘బాహుబలి’ టాలీవుడ్ చరిత్రను తిరగ రాసింది. అయితే ఈ సినిమా కోసం భారీ శరీరాన్ని పెంచుకుని ఎంతో కష్టపడి పెళ్ళిని కూడ త్యాగం చేసి గత మూడు సంవత్సరాలుగా ‘బాహుబలి’ కే అంకితం అయిపోయిన ప్రభాస్ కు చివరకు మిగిలింది ఏమిటి అంటూ ప్రభాస్ అభిమానులు తలలు పట్టుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలు ఇలా రావడానికి గల కారణం ఈమధ్య కాలంలో ఏ అవార్డ్ ఫంక్షన్ లో చూసినా ఒక్క ప్రభాస్ కు మినహా ‘బాహుబలి’ టీమ్ అందరికీ అవార్డ్స్ వస్తూ ఉండటం ప్రభాస్ అభిమానులను తీవ్రంగా కలవర పెడుతోంది అని టాక్. ఈ మధ్య కాలంలో జరిగిన ‘మా’ టివి అవార్డ్స్ - ఫిలింఫేర్ - సైమా అవార్డ్స్ కార్యక్రమాలలో ప్రతి చోటా ‘బాహుబలి’ హవా కనిపించినా ఉత్తమ నటుడు అవార్డు వచ్చే సరికి క్లైమాక్స్ లో ప్రభాస్ ను తప్పిస్తూ ఉండటం ప్రభాస్ అభిమానులకు సమాధానం లేని ప్రశ్నగా మారింది అని అంటున్నారు.

ఈసినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళికి జాతీయ పురస్కారాలు లభిస్తూ ఉంటే ఈసినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ కు ఏ ఒక్క ప్రముఖ సంస్థ నిర్వహించే అవార్డ్స్ కార్యక్రమంలో కనీస గుర్తింపు కూడ లేకపోవడం ప్రభాస్ అభిమానులు జీర్ణించుకో లేకపోతున్నారని అంటున్నారు.ముఖ్యంగా ‘సైమా’ అవార్డ్స్ లో కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో బెస్ట్ హీరో అవార్డ్ ను ప్రభాస్ కోల్పోవడం షాకింగ్ గా మారింది.

‘సైమా’ అవార్డ్స్ లిస్టులో రానా సత్యరాజ్ రమ్యకృష్ణ లకు ‘బాహుబలి’ లో నటించినందుకు అవార్డులు ఇచ్చిన ‘సైమా’ అవార్డ్స్ ప్యానల్ ఉత్తమ నటుడి అవార్డుకు సంబంధించి చర్చలు చేస్తున్నప్పుడు ‘బాహుబలి’ సినిమా అంతా  గ్రాఫిక్స్ తో నిండిపోవడంతో ఈసినిమాలో ప్రభాస్ చేసిన నటన ఉత్తమ నటుడి అవార్డుకు ఎలా సరిపోతుంది అని ‘సైమా’ అవార్డ్స్ ప్యానల్ ప్రభాస్ ను పక్కకు పెట్టింది అన్న వార్తలు కూడ ఉన్నాయి. మరి ఇదే గ్రాఫిక్స్ విషయం రానా విషయంలో ‘ఉత్తమ’ విలన్ అవార్డుకు అడ్డు రాలేదా అని ప్రభాస్ అభిమానులు గోల పెడుతూ కనీసం’బాహుబలి 2’ లో అయినా ప్రభాస్ కు అవార్డులు వస్తే బాగుండును అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ప్రభాస్ కు ‘బాహుబలి 2’ ఏమిచేస్తుoదో  చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: