తెలుగు ఇండస్ట్రీలో తన అద్భుతమైన హావభావాలతో ఎంతో మందిని ప్రేక్షకులను కట్టి పడేసిన నటి..ఒకప్పటి సావిత్రి తర్వాత అంతటి స్థానం సంపాదించిన నటి కీ.శే. సౌందర్య.  బెంగూళురు కి చెందిన సౌందర్య మొదటి చిత్రం తెలుగు కాకపోయానా..కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మోరు ’ చిత్రంతో ఒక్కసారే స్టార్ ఇమేజ్ పెరిగిపోయింది. తెలుగులు ఎంతో మంది అగ్ర హీరోలతో నటించింది..ఒక్కసారి కాకుండా రెండు మూడు సార్లు తమ హీరోయిన్ గా సౌందర్యను తీసుకున్నారంటే అప్పట్లో ఆమెకు ఉన్న క్రేజ్ ఎంలాంటిదో వేరే చెప్పనవసరం లేదు.

అందమైన నవ్వుతో అద్భుతమైన హావభావాలు పలికిస్తూ ఎంతో మందికి అభిమానం చూరగొన్న సౌందర్య ఓ పార్టీ తరుపు నుంచి ప్రచారం చేయడానికి వెళ్లి విమాన ప్రమాదంలో అర్థంతరంగా తనువు చాలించింది.  ప్రస్తుతం ఇండస్ట్రీలో వస్తున్న చాలా మంది హీరోయిన్లు సౌందర్యను ఆదర్శంగా తీసుకున్న వారే. 


మరింత సమాచారం తెలుసుకోండి: