త్వరలో రజనీకాంత్ సినిమా కబాలి విడుదల కాబోతోంది. దీంతో ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కబాలి ఫీవర్ నడుస్తున్నట్టే లెక్క. విదేశాల్లోనూ కబాలి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అసలు కబాలి రజనీకాంత్ ఏం చేస్తున్నారన్నది ఇంట్రస్టింగా మారింది. 

రజినీకాంత్ కొన్ని రోజులుగా అమెరికాలోనే ఉంటున్నారు. కబాలి షూటింగ్ పూర్తి కాగానే ఆయన అమెరికా వెళ్లారు. అయితే ఆయన అమెరికా యాత్ర వెనుక అనేక కారణాలు ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. మొదట్లో అనారోగ్యం కారణంగానే రజినీకాంత్ అమెరికా వెళ్లారన్న వార్త బాగా స్పెడ్ అయ్యింది. 


కానీ దీన్ని రజినీ ఫ్యామిలీ ఖండించింది. మరి రజినీకాంత్ అమెరికాలో ఏంచేసున్నారు.. అంటే ఆయన ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో వస్తున్న 2.0 లో నటిస్తున్నారు. ఇది బంపర్ హిట్ అయిన రోబోకు సీక్వెల్. తాజాగా రజినీ స్టేటస్ గురించి ఆయన కుమార్తె ట్విట్టర్ లో వివరాలు అందించారు.

రజినీ అమెరికా వర్జీనియాలోని  నగరంలోని సచ్చిదానందదాస్‌ లోటస్‌ టెంపుల్‌లో పూజలు చేశారట. కుమార్తె ఐశ్వర్యాధనుష్‌ తో కలసి ఆలయంలో దిగిన ఫోటోలను ఈ ట్విట్టర్ లో పెట్టారు. రజనీకాంత్‌ చెన్నైకి వచ్చే వివరాలను త్వరలోనే చెబుతానంటున్నరు ఐశ్వర్య. 



మరింత సమాచారం తెలుసుకోండి: