తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు నెంబర్ వన్ రేసు లో దూసుకువెళ్తున్న విషయం తెలిసిందే.. అంతే కాదు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో యాడ్స్ లో నటించి విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు మహేష్.   తెలుగు ఇండస్ట్రీలో ఆరడుగుల అందగాడిగా పేరు తెచ్చుకున్న ఈ హీరోతో నటించడానికి ఏ హీరోయిన్ అయితే వెంటనే ఓకే చెప్పేస్తుంది. అలాంటిది మహేష్ కి ఓ బాలీవుడ్ భామ నో అని చెప్పడం ఆ మద్య పెద్ద సంచలనమే రేకెత్తించింది.  ఈ సంవత్సరం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ నటించిన ‘బ్రహ్మోత్సవం’ఘోరమైన పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల తర్వాత మహేష్ తన కుటుంబంతో హాలిడే టూర్ వెళ్లారు.  తర్వలో తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంతో మందిని సెలెక్ట్ చేసినప్పటికీ బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణితి చోప్రాను తీసుకోవాలని డిసైడ్ కావడంతో ఈ అమ్మడిని సంప్రదించగా ఏకంగా మూడు కోట్లు డిమాండ్ చేసిందట.  దీంతో చిత్ర యూనిట్ ఒక్కసారే ఖంగు తినడం ఆమెను పక్కన బెట్టడం జరిగిందట. ప్రస్తుతం ఈ చిత్రంలో హీరోయిన్ గా రకూల్ ప్రిత్ సింగ్ ని సెలక్ట్ చేసినట్లు ఆ మద్య స్వయంగా మురుగదాస్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే మహేష్ లాంటి హీరో పక్కన చాన్స్ వచ్చినా ఎందుకు తప్పుకున్నట్లు పరిణితి చోప్రాను ప్రశ్నించగా అవును తెలుగు హీరో మహేష్ సరసన తనను నటించమన్న మాట వాస్తవమే కానీ నేను ఎలాంటి సంతకాలు చేయలేదని అంతే కాదు తన కాల్షీట్లు చూసుకొని డేట్స్ గురించి వివరిస్తా అని చెప్పినట్లు కానీ అప్పటికే ఆ చిత్రంలో తాను నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయని చెప్పింది.

ఇక నేను సంతకమే చేయనపుడు సినిమాలోంచి నేను ఎలా తప్పకున్నట్లు అవుతుందని అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి చాన్సులు వస్తున్న నేపథ్యంలో కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో నేనీ చిత్రాన్ని వదులుకొన్నా. అంతకు మించిన కారణాలేం లేవు'' అని క్లారిటీ ఇచ్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: