తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ భామలు చాలా మంది వచ్చినా ఏ ఒక్కరూ స్థిరపడలేక పోయారు. కానీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మోడల్ , నటి రకూల్ ప్రితి సింగ్ వరుసగా హిట్ చిత్రాల్లోనటించి స్టార్ హిరోయిన్ గా పేరు తెచ్చుకుంది. రకూల్ అదృష్టం బాగా కలిసి రావడంతో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈ బ్యూటీ మురుగదాస్, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో కూడా  ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడికి మరో అదృష్టం కలిసి వచ్చింది..ఈ సంవత్సరం మెగా హీరో అల్లు అర్జున్ ‘సరైనోడు’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ఈ భామ మరో మెగా హీరోతో రాబోతున్నట్లు సమాచారం. ప్రిన్స్ మహేష్ బాబుతో పాటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోనూ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంపికైందన్న టాక్ వినపడుతోంది.

‘గోపాల గోపాల’ ఫేం డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఆ మద్య పవన్ కెరీర్ మలుపు తిప్పిన ఖుషి చిత్రం దర్శకుడు ఎస్.జె. సూర్య తో పవన్ చిత్రం రానున్నట్లు వార్తలు వచ్చాయి, కానీ ఈ ప్రాజెక్టు నుంచి సూర్య తప్పుకున్నారు. అయితే పవన్ తో సినిమా చాన్స్ గోపాల గోపాల దర్శకుడు డాలికి రావడం ఈ సినిమాకు సంబంధించి, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, అలాగే మరో వైపు తారాగణం ఎంపిక కూడా జరుగుతోందని సమాచారం.

ఆగష్టు నెలాఖరులో గానీ, సెప్టెంబర్ లో గానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.  ఇప్పటికే రామ్ చరణ్ తో ‘ధ్రువ’ సినిమాలో నటిస్తున్న రకుల్ కు, మహేష్ తో చాన్స్ రావడం గొప్ప చాన్స్ అయితే ఇప్పుడు పవన్ పక్కన కూడా చోటు దక్కడంతో ఈ అమ్మడు అదృష్టం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ దెబ్బతో ఆమెను నెంబర్ 1 స్పాట్ లో నిలబెడుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే పవన్ సినిమాలో రకుల్ ఎంపికపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: